జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్ / గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు,ఈ మీడియా సమావేశంలో గత ప్రభుత్వం రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి నిరుద్యోగాన్ని మరింతగా పెంచారని, ఇక్కడి పరిశ్రమలు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను పక్క నియోజకవర్గాలకు తరలించడం జరిగిందని ఆయన అన్నారు. శాసనసభ్యుడుగా ఇక్కడి ప్రజలు నన్ను గెలిపించినందుకు వారి సేవ చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని,అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తాను ప్రత్యేక శ్రద్ధ వహించి రానున్న తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం అని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. రామగుండానికి 29 కోట్లతో ఆర్ అండ్ బి నిధులు కేటాయించామని, 10 కోట్లతో DMFT,10 కోట్లతో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్,సింగరేణి సంబంధిత ప్రాంతాల్లో సింగరేణి వారి సహకారంతో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు, మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు
మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి -ఆదివాసి కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు
రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం కొనసాగుతుంది చేరికలను ఆహ్వానించాలని హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు మరియు భూపాలపల్లి మండలం సెగ్గంపల్లి బొగ్గు కంటా లోడింగ్ ఆన్ లోడింగ్ కార్మికులు సుమారు 300 మంది సోమవారం *భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్,మే 4(జనం గొంతు ): సుల్తానాబాద్ పట్టణ కేంద్రం గాంధీనగర్ లో నేహా పాఠశాలను శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలన్నారు.పాఠశాల యాజమాన్యం స్వప్న సంతోష్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి మినుపాల స్వరూప ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్ దున్నపోతుల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్,చిలుక సతీష్,కుమార్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
జనం గొంతు : రాయికల్ పట్టణ గుడేటి రెడ్డి సంఘం లో రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 66 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు అయిన 66 లక్షల రూపాయల విలువగల చెక్కులను మరియు 116 మంది సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 23 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,ఎమ్మార్వో ఖయ్యూం, ఎంపిడిఓ,ఇంచార్జి కమిషనర్ చిరంజీవి,కౌన్సిలర్ అనూ రాధ, కో ఆప్షన్ సభ్యులు సోహెల్,మహేంద్ర బాబు,నాయకులు కోల శ్రీనివాస్ ,షైక్ హుస్సేన్,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ //జనం గొంతు : రాయికల్ గుడేటి రెడ్డి సంఘ భవనంలో గురువారం రోజు జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం గుడేటిరెడ్డి సంఘ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. తదనంతరం సంఘ భవనానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే గారు దీనికి సానుకూలంగా స్పందించారు. అలాగే రాయికల్ అల్లూరి సీతారామరాజు బొమ్మ నుండి మార్కెట్ యార్డ్ వరకు విద్యుత్ దీపాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని స్పందించారు. ఇట్టి కార్యక్రమంలో గుడేటిరెడ్డి సంఘం అధ్యక్షుడు కాకరి రాజేందర్ రెడ్డి,కోశాధికారి వెలమ నరేందర్ రెడ్డి,ఏనుగు మల్లారెడ్డి ,బద్దం సంజీవరెడ్డి, సింగిరెడ్డి రాజేందర్,నూతల దేవేందర్, ఎలేటి తిరుపతిరెడ్డి, ఎడమల రాజు రెడ్డి,సురకంటి రాజారెడ్డి,బద్దం రవీందర్మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ లో చేరారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. శనివారం రాయికల్ పట్టణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనుల నిధులు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.ఆనాడు కల్వకుంట్ల కవితక్క గారు ఇచ్చిన రూ. 25 కోట్ల నిధుల పనులే నేటికీ కొనసాగుతున్నాయి తప్ప ఒక్క పైసా నిధులు తెచ్చి ఎమ్మెల్యే రాయికల్ పట్టణం, మండలం అభివృద్ధి చేయలేదు. మినీ ట్యాంక్ బండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటి పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వ భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని బిఆర్ఎస్ లో గెలిచి,కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్న. కవితక్క ఇచ్చిన నిధులు తప్ప,ఎమ్మెల్యే సీడిపి నిధులు కేటాయించలేదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.దానికోసం ఎమ్మెల్యే గారు పార్టీ మారాడని పేర్కొనడం విడ్డురం. రైతు వ్యతిరేకి అని విమర్శించిన రేవంత్ సమక్షంలో ఈ జగిత్యాల పక్షపాతి చేరాడు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడంతో తులామో, మాసమో తెస్తాడని నియోజకవర్గం ప్రజలు ఎదిరి చూస్తున్నారు. పెన్షన్ లు మేమే ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచి కాంగ్రెస్ కి వెళ్లారు.ఇప్పుడు ఆ అవ్వ, అయ్యలు కూడా పెరిగిన 4000/- పెన్షన్ కోసం ఎదుచూస్తున్నారు మా ఎమ్మెల్యే గారు తెస్తారని. రైతు బంధు ను భరోసా గా మార్చారు.ఇంకా రైతులకు అందలేదు.కూలీలకు అందలేదు. మహాలక్ష్మి పథకంకు అవసరం అయిన నిధులు బడ్జెట్ లో ఊసే లేదు. 2500 ఇస్తామన్న హామీలకు ఆశపడి ఎదిరిచూస్తున్న మహిళా తల్లులకు పార్టీ మారిన ఎమ్మెల్యే ఇప్పిస్తాడా? లేకపోతే చచ్చిన బ్రతికిన అదే పార్టీలో ఉంటానన్న జీవన్ రెడ్డి గారు ఇప్పిస్తాడా అనేది మహిళలకు సమాధానం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలో తీపిలేని రుచి లాగా ఉంది. కులసంఘాలకు ,చేతి వృత్తులకు ప్రోత్సాహం బడ్జెట్ లో కరువైంది. దళిత బంధు ఊసే లేకపోవడం విచారకరం. ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టిన బడ్జెట్ తో ఎవరికీ ఇస్తారు? ఎంతమందికి ఇల్లు ఇస్తారు అనేది సమాధానం ఇవ్వాలి. రుణమాఫీ కి షరతులు విధిస్తూ మాఫీ దక్కకుండా చేస్తున్నారు. అరు గ్యారంటీ లు 13 హామీల్లో ఎన్నింటికి బడ్జెట్ కేటాయింపులు చేశారో, కేటాయించని వాటి అమలు పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు ప్రభుత్వం, ప్రతినిధులు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ప్రభుత్వంను నీలదీస్తున్నారు. నమ్మి ఓట్లేస్తే పార్టీ మారి తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన బీఆరెస్ పక్షాన మేమంతా అండగా ఉంటాం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్,మండల మహిళా అధ్యక్షురాలు రాచమడుగు స్పందన,కౌన్సిలర్లు శ్రీరాముల సువర్ణ సత్య నారాయణ, తురగ శ్రీధర్ రెడ్డి,మరాంపెళ్లి సాయి,మహేష్ గౌడ్,నాయకులు లావుడియా సురేందర్ నాయక్,ఉదయశ్రీ,దొంతి నాగరాజు,గంగాధర్,బర్కం మల్లేష్,చాంద్, హరికృష్ణ,రాజేశం,రాంచంద్రం,వినోద్,శ్రీనివాస్,రాంచంద్రం,బబ్లూ,రాంప్రసాద్,బుఖ్య లక్ష్మి తదితరులు పాల్గోన్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వ డివిజన్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి,సహకరిస్తున్న అధికారులకు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. -నగునూరి సుమలత రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వ డివిజన్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి,సహకరిస్తున్న అధికారులకు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.