|
modi add 1

తాటిపల్లి లో మంచి నీటి ప్లాంట్ ప్రారంభోత్సవం

తాటిపల్లి లో మంచి నీటి ప్లాంట్ ప్రారంభోత్సవం జనం గొంతు /మల్యాల ప్రతినిధి ఫాతిమా నగర్ ఆడోరేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మానోస్ యూనిదాస్ ఆర్థిక సహాయంతో మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో బుధవారం ఫ్లోరైడ్ రహిత మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన స్పెన్ దేశానికి చెందిన రోషియ్, అల్బట్ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫ్లోరైడ్ రహిత నీరు త్రాగడం వలన వ్యాధులు దరిచేరవాన్నారు.ప్రతి ఒక్కరూ మంచి నీటి ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్ ప్రీతి, మదర్ అనీష్,ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ దీప్తి,వేలంగాని,సంస్థ ప్రతినిధులు మర్రి మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి,రమేష్, మౌనిక,రూపా, జమున,స్వరూప,గ్రామ పెద్దలు,నాయకులు ఆనంద రెడ్డి,మహిపాల్ రెడ్డి,లక్ష్మణ చారి, మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 28, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1