|
modi add 1

నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభం

ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు గురువారం నాడు, జిల్లాలోని శామిర్పెట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని (రుద్రమ దేవి ఓల్డ్ ఏజ్ హోం సొసైటీని) రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు) పింకేశ్ కుమార్, ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్షి, తదితరులు ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్ళు పసి పిల్లలతో సమానమని, వారి ఆలన పాలన చుస్కోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. వాళ్ళు లేకుంటే మనం లేమని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. ప్రభుత్వం వృద్దులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిని అందిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఈ రుద్రమ దేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆరు గ్యారెంటీలతో రూపకల్పన చేసిందన్నారు. తొలి విడతగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి, శాసనసభ్యులు యశశ్విని రెడ్డి, రాణి రుద్రమ్మ మహిళా సొసైటీ సీఈవో కవిత రెడ్డి, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

తాటిపల్లి లో మంచి నీటి ప్లాంట్ ప్రారంభోత్సవం

తాటిపల్లి లో మంచి నీటి ప్లాంట్ ప్రారంభోత్సవం జనం గొంతు /మల్యాల ప్రతినిధి ఫాతిమా నగర్ ఆడోరేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మానోస్ యూనిదాస్ ఆర్థిక సహాయంతో మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో బుధవారం ఫ్లోరైడ్ రహిత మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన స్పెన్ దేశానికి చెందిన రోషియ్, అల్బట్ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫ్లోరైడ్ రహిత నీరు త్రాగడం వలన వ్యాధులు దరిచేరవాన్నారు.ప్రతి ఒక్కరూ మంచి నీటి ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్ ప్రీతి, మదర్ అనీష్,ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ దీప్తి,వేలంగాని,సంస్థ ప్రతినిధులు మర్రి మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి,రమేష్, మౌనిక,రూపా, జమున,స్వరూప,గ్రామ పెద్దలు,నాయకులు ఆనంద రెడ్డి,మహిపాల్ రెడ్డి,లక్ష్మణ చారి, మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 28, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1