రాయికల్ పట్టణానికి చెందిన బొమ్మకంటి అంజనశ్రీకి గాన కోకిల కళానికేతన్ 32వ వార్షికోత్సవ సందర్భంగా గాన కోకిల నంది పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అమె చేసిన శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. దివ్యాంగులైన బొమ్మకంటి అంజనశ్రీ శాస్త్రీయ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు అందుకున్నది. అలాగే డిసెంబర్ 3న ప్రభుత్వపరంగా రాష్ట్రీయ అవార్డు అందుకున్నది. మంగళవారం గాన కోకిల కళానికేతన్ 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల టౌన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో బొమ్మకంటి అంజనశ్రీకి మున్సిపల్ చైర్మన్ ఆడువాళ్ళ జ్యోతి, గానకోకిల కళానికేతన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమణ తనయుడు కార్తీక్, అధ్యక్షులు ఎలిగేటి రాజేంద్రప్రసాద్, టీవీ సూర్యం కొండలరావులు అందజేశారు. అవార్డుకు ఎంపిక చేసిన అద్యక్షులు ఎలిగేటి రాజేంద్రప్రసాద్, గానకోకిల కళానికేతన్ బృందానికి అంజనశ్రీ తల్లిదండ్రులు బొమ్మకంటి నాగరాజు-గౌతమిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ స్టార్స్ పుష్ప2 సింగర్ లక్ష్మి, ఓ పిల్లగా వెంకటేష్ ఫేమ్ పూజ నాగేశ్వర్, లాస్య స్మైలీ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.