రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న 300 మందికి శ్వేత ట్రేడర్స్ అధినేత లయన్ జెడ్ సి కాటిపెళ్లి రామ్ రెడ్డి లత 25వ వివాహమహోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమాన్లు, కంటి వైద్యులు డాక్టర్ ప్రభాకర్,లయన్స్ క్లబ్ డిసీలు మ్యా కల రమేష్,బత్తిని భూమయ్య,అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి,ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్,కోశాధికారి గంట్యాల ప్రవీణ్,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,కనపర్తి శ్రీనివాస్, ఎద్దండి దివాకర్,బొమ్మ కంటి నవీన్,మండలోజు శ్రీనివాస్,పారిపెల్లి శ్రీనివాస్,ఆడెపు రాంప్రసాద్,కుర్మా సుదర్శన్,కొత్తపెళ్లి రంజిత్,సామల్ల గోపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ధూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బిజెపి సూక్ష్మ విరాళ ప్రచారాన్ని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ప్రారంభించారు. సూక్ష్మ విరాళా ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించి బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి సందర్భంగా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక సూక్ష్మ విరాళం ప్రచారంప్రారంభించిందన్నారు. సూక్ష్మ విరాళం బిజెపిని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. పార్టీ సభ్యులు , కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు, దాతలు రూ.5, రూ 50, రూ.100, రూ.500 , రూ.1000 లను సహకార ఎంపికల నుండి ఎంచుకోవచ్చన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఈ సూక్ష్మ విరాళాల ప్రచారం ద్వారా కార్యకర్తలు మిలియన్ల మంది వ్యక్తితో కనెక్ట్ అవుతారన్నారు. నమో యాప్ లోని డొనేషన్ మాడ్యూల్ ద్వారా విరాళాలను సేకరించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రఫుల్, పురం హరి, కులగాని శ్రీనివాస్, హరి ప్రసాద్, నరేందర్, రవీందర్, గుంజేటి శివకుమార్, తోట అనిల్, సుధాకర్, చింతల శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.