|
modi add 1

సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం.

హాజరైన మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచన అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం.

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

0-5 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు

-పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా నేరేడు కొండ మండల కేంద్రములో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది అని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే చనిపోయిన పిల్ల ఏనుగుల మృతదేహాలకు పద్ధతి ప్రకారం ఏనుగులు అంత్యక్రియలను నిర్వహిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు 2022, 2023లో బెంగాల్‌లో ఉండే 15 నుంచి 20 ఏనుగులకు సంబంధించి ఐదు కేసులను విశ్లేషించినట్టు అధ్యయనంలో భాగమైన ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కశ్వాణ్‌, ఆకాశ్‌దీప్‌ రాయ్‌ పేర్కొన్నారు. ఈ వివరాలు ‘థ్రెటెన్డ్‌ టాక్సా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి...

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య పెంచాలి

అంగన్వాడీ సెంటర్ లో అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాయికల్ మండలము భూపతిపూర్ అంగన్వాడి సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ చిరంజీవి మాట్లాడుతూ పిల్లల సంఖ్య ను అంగన్వాడీ లో పెంచే విధంగా కృషిచేయాలని సూచించారు.పిల్లలకి పోషకాలతో కూడిన సమతుల్య ఆహరం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ,సెక్రటరీ హరికృష్ణ, సూపర్వైజర్ రాధ,అంగన్వాడీ టీచర్స్,కవిత,సుమలత ,సుగుణ ,ఆశా వర్కర్లు, వివోలు పాల్గొన్నారు

By Gantyala Praveen | August 06, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1