|
modi add 1

రెస్టారెంట్ ఫుడ్ తో ప్రాణగండం జర జాగ్రత్త!!

రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళ వారం వివిధ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కె సి ఆర్ కాలనీ కవిత థియేటర్ ప్రాంతంలో సాఫ్రాన్ మండి పేరుతో నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ లో నిలువ ఉంచి నాణ్యతగా, పరిశుభ్రంగా లేని ఆహార పదార్థాలను గుర్తించారు. వాటిని ఉపయోగించకుండా ఫినాయిల్ పోసారు. నిర్వాహకుల నుండి ముప్పదివేల రూపాయలు జరిమానా గా వసూలు చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, వైకుంఠం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments