రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి అత్యవసర సమయంలో ముందుకు వచ్చి నేనున్న అని రాయికల్ మండలం మైతపూర్ గ్రామానికి చెందిన దివ్య కు రక్తం ఇచ్చి ఆదుకున్న అయ్యూబ్. "ఆపద్బంధావుడా నీకు సలాం" ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రామాజీపేట నుండి జగిత్యాల వచ్చి రక్త దానం చేసిన యువకుడు అయ్యుబ్ మైతపూర్ కి చెందిన మహిళా శాస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసర స్థితిలో ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి బంధువులు రాయికల్ కు సమాజిక కార్యకర్త మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ మున్ను కు సమాచారం ఇవ్వగా వెంటనే జగిత్యాల జిల్లా ప్రాణ దాతల సమూహం గ్రూప్ సభ్యుడు అయ్యూబ్ కు సమాచారం ఇవ్వగా వెంటనే రక్తనిదికి చేరుకుని రక్తం ఇవ్వడం జరిగింది. రక్త దానం చేసిన యువకున్ని జగిత్యల జిల్ల రక్త దాతల సమూహం గ్రూప్ సభ్యులు మరియు సమాజిక కార్యకర్త రియాజుద్దీన్ , రషీద్, సుజాయిత్ అలీ, తదితరులు అభినందించారు. ఇందులో భాగంగా మున్ను మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువకులు రక్త దానానికి ముందుకు రావాలని కోరారు.
Your experience on this site will be improved by allowing cookies.