|
modi add 1

ఆషాడ మాస గోరింటాకు పండగ మహోత్సవం..

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఏ ఉరిలో ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. రాయికల్ పట్టణం లోని కేశవనగర్ పద్మశాలి మహిళా యువజన సంఘంలో గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ ఎలిగేటి లతీక మాట్లాడుతూ పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ మహిళలు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూడా అర్థం ఉంటుంది. అందులో ఒకటి గోరింటాకు పండగ. తెలుగు లోగిళ్ళలో పండగ అయినా, పబ్బమైనా, అమ్మాయిల చేతులు, కాళ్లు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఇక ఆషాడ మాసంలో గోరింటాకును నూరి, చేతులకు పెట్టుకుంటే, శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మరుతు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి, బయటి వాతావరణం చల్లగా ఉంటుంది, దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి,జ్వరాలు, అనారోగ్య సమస్యలు, ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకు లోని ప్రత్యేక గుణం వల్ల, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు అర చేతిలో, పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పద్మశాలి యువజన సంఘ సభ్యులు ఎలిగేటి షర్మిల, గంట్యాల లక్ష్మి శ్రీ,వార్డ్ కౌన్సిలర్ ఎలిగేటి లతీక, బొమ్మ కంటి పద్మ, ఆడెపు రమ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 18, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1