రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, నగర అభివృద్ధి దిశగా జరుగుతున్న మార్పులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమాఖ్య వారీగా బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జె. అరుణశ్రీ మహిళా సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు.
Your experience on this site will be improved by allowing cookies.