* సమాచార పౌరసరఫరాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసిన జర్నలిస్ట్ సంఘాల నేతలు పాత్రికేయులపై దాడుల నివారణకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేశాయని, అటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురావాలని అఖిల భారతీయ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరావులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసరఫరాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం హయంలో సమాచార శాఖలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ఆధారాలతో కూడిన సీల్డ్ కవర్ ను కూడా అందజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.