రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్లో ఈరోజు సాయంత్రం మున్సిపల్ సిబ్బంది చేత విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ఎక్కడా నిల్వ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Your experience on this site will be improved by allowing cookies.