బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్. ఇటీవల తనపై జరిగిన పాశవికదాడి గురించి కేంద్రమంత్రికి వివరించిన సుదర్శన్. ఈ కేసులో ఇల్లందు పోలీసులు అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, మరో ముగ్గురిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చిన సుదర్శన్. ఈ విషయంలో సంబంధిత జిల్లా ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి. బాధిత జర్నలిస్టుకు భరోసా కల్పించిన మంత్రి. కార్యక్రమంలో డబ్ల్యూజేఐ నాయకులు న్యాలకొండ అనిల్ రావు,తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితర జర్నలిస్టు లు పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.