రాయికల్ పట్టణంలోని కుమురం భీమ్ విగ్రహం వద్ద కురిసెంగ రామయ్య 25వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వేణు మాట్లాడుతూతోటి జాతి ఆరాధ్య దైవం ఆదివాసి మొదటి తరం ఉద్యోగి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసి తోటి జాతి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన రామయ్య జగిత్యాల జిల్లా రాజారాం పల్లి గ్రామానికి చెందిన సంఘసంస్కర్త అయిన ఆయన వర్ధంతి జయంతి లను గిరిజన సంక్షేమ శాఖ ద్వార నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1945 లో జన్మించి ఎనలేని సేవలు చేసిన నాయకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురుసంగా వేణు,ఆదివాసి జేఏసీ నాయకులు ఆత్రం రవీందర్, మండల ఆదివాసి నాయకులు ఆత్రం శేఖర్,నిర్మల్ జిల్లా నాయకులు చక్కటి రాజు, కురుసంగా శ్రీనన్న, ప్రసన్నకుమార్, పింద్రం లక్ష్మీనారాయణ,ఆత్రం చిన్నానంద్,ఆత్రం శంకర్,దినేష్ కాంగ్రెస్ నాయకులు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.