|
modi add 1

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే...

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే... https://kvsangathan.nic.in/ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం అవుతుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకటో తరగతి అడ్మిషన్‌ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి...మిగతా తరగతుల అడ్మిషన్లకు కూడా వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ వంటి అంశాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా సెలక్ట్‌ చేస్తారు. అయితే 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. ఏం సబ్జెక్ట్స్‌ ఉంటాయి.. ఎన్ని మార్కులు అనే దానికి సంబంధించిన వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న రిలీజ్‌ చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూడు జాబితాల ద్వారా ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కేవీల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతికి తప్ప) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు... 11వ తరగతి అడ్మిషన్ల కోసం.. అలాగే.. 11వ తరగతి తప్ప మిగతా క్లాస్‌ల వారి అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాల కోసం పదో తరగతి రిజల్ట్‌ కోసం వేచి ఉండాలి. టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు వచ్చిన తర్వాత 10 రోజుల్లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. 11వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ముందుగా కేవీ విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అప్లై చేసుకునే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కేవీఎస్‌ వెల్లడించింది... ముఖ్యమైన తేదీలు : ఫుల్‌ నోటిఫికేషన్‌ విడుదల : మార్చి 31, 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024 ఎంపికైన అభ్యర్థుల జాబితా రిలీజ్‌: ఏప్రిల్‌ 19, 2024

By NYALAKONDA ANIL DESAI | April 01, 2024 | 0 Comments

శిల్ప కళా చక్రవర్తి కి పురస్కారం

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ (JCI) అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు, ప్రతిభవంతులకు "ప్రతిభ పురస్కార్ అవార్డ్ " లను అందించారు. ఇట్టి కార్యక్రమంలో సముద్రాల రాజమ్మ-చంద్రయ్య (మాజీ సర్పoచ్) కురిక్యాల గ్రామం గారి ద్వితీయ కుమారుడు సముద్రాల ప్రభాకర్, శిల్పి & ఆర్ట్స్ గారి యొక్క అబ్బురపరిచే, ఔరా అనిపించే చిత్రాలు,విగ్రహాలను జీవం ఉట్టిపడేల తీర్చిదిద్దిన అతని కళను గుర్తించి "అవుట్ స్టాండింగ్ విశిష్ట ప్రతిభ పురస్కార్ అవార్డు" ను అందించి ఘనంగా సత్కరించారు. గతంలో జాతీయ కళా రత్న అవార్డు మరియు ఉత్తమ కళాస్పూర్తి అవార్డు లను అందుకున్నారని, ఇతని అద్భుతమైన కళ కు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని JCI సంస్థ వారు ప్రశంసల వర్షం కురిపించి అభినందించారు.

By Miryala Pranay | February 04, 2024 | 0 Comments

వీలైతే చరిత్రను రక్షించుకుందాం... కాని చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు.

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్.జి మన రావికంటి చరిత్ర రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి! జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా ఒకప్పుడు రాయికల్ ను మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు పేట,గోవిందరాజు పేట, బద్దులాపురం( పద్మాపురం ), నందిపేట, నాగారం, కొండాపురం అను ఏడు గ్రామాలు కలిసి ఏర్పడడం వల్ల గ్రామీణులు దీన్ని ఇప్పటికీ 'రావికంటి' అనే పిలుస్తుంటారు. వేములవాడ చాళుక్యుల/ కాకతీయుల కాలంనాటి గుడి, ఒకప్పుడు దాని చుట్టూవున్న కోటను బట్టి 'గుడికోట' గా ప్రసిద్ధమైన ప్రస్తుతం 'శ్రీ కేశవనాథస్వామి ఆలయం'గా పిలువబడుతున్న ఇక్కడి త్రికూటాలయం రాయికల్ కు మాకుటాయామనం లాంటిది. కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ( 1296-1325) రాజ్యం చేస్తున్న కాలంలో వారి సామంతుడు రుద్రదేవుడు,వారి సేవకుడు బెజగంగూలెంక శకవర్షం 1227 శ్రావణ బహుళ ద్వాదశి వడ్డవారం (క్రీశ1305 ఆగస్టు17మంగళవారం) నాటి దాన శాసనం ప్రకారం ఇది ఆనాడు రామనాథ లఖుమేశ్వర ( లక్ష్మణేశ్వర)ఆలయం. అయితే వేములవాడ రాజధానిగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇది 'జైనాలయం'గా వుండేదని ఈ ఆలయ పరిసరాల త్రవ్వకాల్లో లభించిన జైన తీర్థంకరుని శిరస్సును బట్టి అర్థమౌతుంది. అంతే కాదు ఇక్కడి స్థల చరిత్రలో ఆలయ నిర్మాత గా చెప్పబడే, వైశ్య వనితగా భావించబడే 'లకుమాదేవి 'జైన మతస్తురాలు కావడం విశేషం. ఈ రాణి స్వాభిమానం మహిళా లోకానికే గర్వ కారణం. లకుమాదేవి తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఆమె మామగారు లోపలికి రావడం , అది ఆమె గమనించక పోవడం జరిగిందట. కోడలు తనను చూసి కూడా లేచి నిలబడలేదని, కుర్చీ పీట వేయలేదని ఆగ్రహించిన ఆ పెద్దాయన ' వంపున చెరువు - మిట్టన గుళ్ళు కట్టించిన రాణిలా మిడిసిపడుతున్నావని' అన్నాడట. ఆత్మభిమానం గల లకుమ బాధ పడుతూనే 'గర్వంతో కాదు మీ రాక గమనించకనే, అయితే మీ వాక్కుల్లో నాకు భవిష్యత్ వాణి వినబడుతుంది, మీరన్న పనులు నేను చేసి చూపుతా'నని ప్రతిన బూని తన తల్లిగారు పెట్టిన ఏడు వారాల నగలను కూడా అమ్మి 'మిట్టన ఈ గుళ్ళు - వంపున చెరువు' నిర్మించిందని చెబుతారు. చెరువు నిర్మాణం పూర్తి అయినా వర్షాభావం వల్ల అది నిండకపోవడాన్ని కొందరు పండితులు తన దోషంగా చెబుతూ చెరువు నరబలి కోరుతుందనడంతో స్వయంగా తానే ఒక అర్ధరాత్రి లేచి సర్వాలంకార భూషితయయి వెళ్లి చెరువులో ఒక గుండు దగ్గర ఊరి కోసం ప్రాణత్యాగం చేసిందన్నది బహుళ ప్రచారంలోనున్న కథ. ఈ మహాసాధ్వి పేరుతో ఇప్పటికీ అది 'లకుమాదేవి గుండు 'గానే పిలువబడుతుంది. కాకతీయుల కాలం నాటి 'బెజగంగూలెంక దాన శాసనాన్ని' లెక్కలోకి తీసుకున్నా రాయికల్ దాదాపు ఏడున్నర శతాబ్దాల నాటి చారిత్రక గ్రామం. 'మాధవ చరిత్ర(అముద్రితం) 'కర్త తిరునగరి నర్సింహదాసు, రామశతక కర్త వరకవి భూమగౌడు (వీరి జీవిత ఆధారంగా నేను రచించిన నవల ఇదే పేరుతో 2017 లో వెలువడింది. కీ శే వేముల పెరుమాళ్ళు గారు రాయికల్ మండల మొదటి అధ్యక్షులు(1987-1993)కావడమే కాకుండా 'శ్రీ కేశవనాథ స్వామి ఆలయ' చరిత్రను వెలికితీసి దీని అభివృద్ధికి విశేషంగా కృషి చేసినారు. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో కొంతమంది స్వలాభం కోసం చరిత్రను కించపరుస్తూ చరిత్ర హీనులగా గుర్తుండిపోతారు. మీ జనం గొంతు..

By NYALAKONDA ANIL DESAI | November 08, 2023 | 0 Comments

Hot Categories

2
1
6
1