రామగుండం నగర పాలక సంస్థలో శనివారం పదవీ విరమణ పొందిన సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఈదునూరి పోషం, కాదాసు రాజయ్య, తిప్పారపు ఐలయ్యలకు ఘనంగా సన్మానం నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్ జె. అరుణ శ్రీ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఉద్యోగులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేసి నగర అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. వారి సేవలను నగర పాలక సంస్థ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.