కైండ్స్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తబిత అనాథ ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. రామగుండం ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ సంస్థ పోస్టర్ను ఆవిష్కరించి విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లల విద్యాభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో దయానంద్ గాంధీ, నంది మేడారం స్కూల్ ప్రిన్సిపాల్ పద్మ, ఫౌండేషన్ డైరెక్టర్లు సుంచురి రాజశేఖర్, మిట్టపల్లి లిటిల్, గుంటి రవికుమార్, గజ్జల ప్రవీణ్, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.