కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం పరిధిలోకి వేములవాడ రాజన్న దేవాలయాన్ని తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్ ది.. *కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీ ఎమ్మెల్యేలను కలుపుకొని పోయి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. *కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తేకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయ్..? *ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు... బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ దని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బుధవారం రోజున కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ కుమార్ కేంద్రమంత్రి అయ్యాక చేస్తున్న అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రమంత్రి అయ్యాక బండి సంజయ్ కుమార్ వేములవాడ ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని , అందులో భాగంగా ఇటీవల కేంద్ర ఆర్కిటెక్చర్ బృందం రాజన్న ఆలయం మాస్టర్ ప్లాన్ తో పాటు పరిసరాలన్నిటినీ పరిశీలించిందన్నారు. బండి సంజయ్ కుమార్ చొరవతో కోట్ల రూపాయల నిధులతో రాజన్న దేవాలయ ముఖ చిత్రం మారనుందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ నిధులతో చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలలో చేయిస్తున్న అభివృద్ధి పనుల విషయంలో మీ ఎమ్మెల్యేలను కలుపుకొని పోయి శంకుస్థాపనలు చేసిన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా.? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతుంటే ముఖ్యమంత్రి చిల్లి గవ్వ తేలేదని మాట్లాడడం అవివేకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం , సీఎం రేవంత్ రెడ్డి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పనికిమాలిన రాజకీయ వ్యాఖ్యలు చేస్తుందని ఆయన మండిపడ్డారు ఆరు గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్నింటినీ కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, నేడు ఉద్దెర ముచ్చట్లు మాట్లాడుతూ, అనవసరమైన రాజకీయాలు చేస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు.
Your experience on this site will be improved by allowing cookies.