|
modi add 1

మోడీ స్ఫూర్తితో యువతలో సేవాభావం పెంపు: కందుల సంధ్యారాణి

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ కార్యక్రమాల్లో భాగంగా గోదావరిఖని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ ప్రదర్శించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. యువతలో ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంపొందించడమే సేవా పక్వాడ్ లక్ష్యమని కందుల సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమల మహేష్, ముస్కుల భాస్కర్ రెడ్డి, ఐత పవన్ తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | September 27, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1