గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్&బీ, మున్సిపల్ అధికారులు, డీఈ, ఏఈలతో కలిసి రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష జరిపారు. పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.