|
modi add 1

కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) (ఆర్. యస్. యస్.) వ్యవస్థాపకులు. (జూన్ 21న హెగ్డేవార్ వర్ధంతి సందర్భంగా)

యుగ ద్రష్ట 'హిందు చైతన్య శక్తి'కేశవ్ బలిరాంహెగ్డేవార్ మహాపురుషులు మరణించిన వారి బోధనలు కార్యశీలత‌ చూపిన మార్గం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.హిందూ సమాజ సంఘటనకు 'ఐక్యతకు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దిశ దశను నిర్దేశించిన హెగ్డే వార్ చూపిన మార్గం నేటికిఅనుసరణీయం. జన జాగృతి _డాక్టర్ హెగ్డేవార్. కొంతమంది మహాపురుషులు భవిష్యత్తునుగురించినదార్శనికత 'సత్యాన్ని అనుభవించి, తమధృడమైనఆత్మబలంతోను, ధృడ విశ్వాసంతోను ముందుతరాలకుమార్గదర్శనం చేస్తారు. కొంత మంది సమాజ హితమే లక్ష్యంగా తమ జీవన విధానాన్ని గడుపుతూ త్యాగం 'సమాజ సేవా 'జన జాగృతి కొరకు తమ జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు కేశవ్ బలరాం హెగ్దేవార్. హిందూ సమాజానికి మార్గదర్శి_ డాక్టర్ 'హెగ్డేవార్. కొంత మంది థైర్య సాహసాలతో లక్ష్య సాధనకు పట్టుదల నిరంతరం చైతన్యం తోకృషి చేస్తూ ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. సమాజ చీకటిని పారదోలే దీపంగ వెలుగు నిస్తారు. డాక్టర్ హెగ్డేవార్ అదే మార్గంలో పయనించి హిందూసమాజానికిమార్గదర్శిగా నిలవడం గమనార్హం. డాక్టర్ 'జీ _ఒక ఆశాజ్యోతి గురూజీ వాఖ్య. ఏదో ఒకసామాజిక కార్యక్రమం స్వీకరించి చేయడం మొదలు పెట్టిన తర్వాత వచ్చిన కష్టాలను ఎదుర్కొనక నిరాశ' నిస్పృహలకు లోనయ్యే వారికి డాక్టర్ జీ జీవితం నుంచి ఒక ఆశాజ్యోతి 'దివ్య సందేశం ప్రాప్తమై ప్రేరణ లభించగలదు. .. __గురూజీ డాక్టర్ జీ _యువతపై ప్రభావం. డాక్టర్ జీ కార్య కుశలత 'దృఢ దీక్ష 'దేశభక్తి యువతను ప్రభావితం చేసింది . వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. 1925 సం" లో ఆర్ 'ఎస్' ఎస్ స్థాపన _డాక్టర్ 'హెగ్డేవార్. హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులు డా||హెడ్గేవార్ మహారాష్ట్ర నాగపూర్ పట్టణంలో 1925 వ సంవత్సరంలోస్థాపించారు. డాక్టర్జీ 'హెగ్డేవార్ పై జాతీయవాద ఉద్యమాల ప్రభావం డాక్టర్ హెగ్డేవార్ కాంగ్రెస్ సభ్యుడిగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు. డాక్టర్ హెగ్డేవార్ 'స్వామి వివేకానంద 'లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆలోచనలకు ప్రభావితమై పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేసి ధర్మ రక్షణకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అజాద్ హిందూ ఫౌజ్ లాంటి జాతీయవాద సంస్థల ఉద్యమాలు డాక్టర్ జీ నీప్రభావితంచేశాయి.అరబిందో లాంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్త ల ప్రభావానికి లోనైన హెగ్డే వార్ 1921లో కిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ ఇచ్చిన మద్దతు నచ్చక దేశ పరిస్థితుల దృష్ట్యా చెల్లచెదరైన హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. కులాలు' జాతులు 'వర్గాలు' వర్ణాలు పేరుతో ఎవరికి వారే ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. హిందూ ఐక్యత ధర్మ రక్షణ కొరకు 1925లో విజయదశమి రోజున కేవలం 5 గురు సభ్యులతో అర్‌'ఎస్' ఎస్ ను స్థాపించారు . ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థ_ ఆర్ 'ఎస్' ఎస్. నాగపూర్ పట్టణంలో గుప్పెడు మందితో ప్రారంభమైన ఆర్' ఎస్' ఎస్ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. నేడు ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థగా గుర్తింపు పొందింది . దేశం నలమూలల ప్రతి రోజు 80'000 శాఖలతో లక్షలాది స్వయం సేవకులు నిండు గుండెల్లో "భారత్ మాతాకీ జై"అంటూ ఐక్యతా నినాదాన్ని మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తిలో జాతీయభావాలు నిరిపోశాడు. సంఘ శాఖల ద్వారా దేశభక్తులను తయారీని ప్రారంభించారు. ఆర్' ఎస్ 'ఎస్ హిందూ సమాజ ఐక్యతకు 'ధర్మ రక్షణకు జాతీయవాద పరివ్యాప్తికి నిరంతరం కృషి చేస్తుంది. జాతీయవాదం_ ధర్మ రక్షణ హిందూ ఐక్యత _ఆర్' ఎస్' ఎస్ లక్ష్యం. భారతీయుల్లో జాతీయవాదాన్ని ధర్మం కోసం హిందూ ఐక్యత కోసం జరిగిన ఎన్నో పోరాటాలకు ఆర్' ఎస్' ఎస్ స్ఫూర్తి. దేశం కోసం వ్యక్తుల్లో సమర్పణ భావాన్ని ప్రేరేపించడంలో ఆర్ 'ఎస్' ఎస్ మహత్తర పాత్రను పోషిస్తుంది. సమాజ సేవలో_ భాగస్వామ్యం. ఆర్ 'ఎస్ 'ఎస్ శాఖకు ప్రత్యక్షంగా రాకపోయినా పరోపక్షంగా అనేక క్షేత్రాల్లో ఎంతో మందిని సమాజ సేవలో దేశ మాత సేవలో తరింపచేస్తున్న గొప్ప సంస్థ ఆర్ 'ఎస్' ఎస్. దేశమేమిన్న _దేశమే సర్వస్వం_ఆర్ 'ఎస్' ఎస్. హిందూ ఐక్యతే ధ్యేయంగా దేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయడానికి అవిరళ పోరాట పటిమ ప్రదర్శించిన ఆర్ 'ఎస్ ఎస్ సమాజంపై గట్టి ప్రభావాన్ని చూపింది. చారిత్రిక తప్పిదాలను ఎండగడుతూ దేశమే మిన్న దేశమే సర్వస్వం అనుకోగల వ్యక్తుల సమూహాన్ని సమాజానికి అందిస్తుంది. సామాజిక సమరసతకు_ పెద్దపీట. సంఘ్ శాఖల్లో సామాజిక సమరతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.కుల జాడ్యానికి తావు లేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. "ఆంధరం హిందువులం అందరం భారతీయులం " అనే ఆత్మీయ భావనను తీసుకువచ్చారు. సంఘ శిభిరాన్ని సందర్శించిన మహాత్మాగాంధీ' అంబేద్కర్ కులం గురించి ప్రశ్నిస్తే మేమంతా హిందువులం అని చెప్పడం వల్ల కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెళ్ళి విరియడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ హెగ్డేవార్ ఒక చైతన్య శక్తి. డాక్టర్జీ హెగ్డేవార్ ఆశించిన ఫలితాలుసాకారమై కనపడుతున్నాయి. అలాంటి సంస్థకు అంకురార్పణ చేసిన మనిషి నిజమైన దృష్ట అటువంటి యుగ ప్రవక్తలలో అగ్రశ్రేణి కి చెందిన వ్యక్తి మాత్రమే కాదు హెగ్దేవార్ ఒక చైతన్య శక్తిగా సమకాలీన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు . డాక్టర్ హెగ్డేవార్_ జననం. హెగ్డేవార్ పూర్వీకులు తెలంగాణలోని మహరాష్ట్ర సరిహద్దు సమీపాన బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందిన వారు 1889ఏప్రిల్ 1( ఉగాది పండుగ రోజున) బలిరాం పంత్ హెగ్డేవార్ 'రేవతి బాయి దంపతులకు కేశవరావు బలిరాం హెగ్డేవార్ జన్మించారు. కుందుర్తి గ్రామం వద్ద గోదావరిలో మంజీర హరిద్ర నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఆర్.ఎస్.ఎస్. పేరు దేశ విదేశాల్లో కోట్లమంది ప్రజలకు తెలుసు. కాని ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డా||బలీరాం కేశవ హెడ్గేవార్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వింతగా కనిపించినా నిజం. ఆయన గురించి కొంత తెలిసిన వారికి కూడ వారి గొప్పదనం, వారి దూరదృష్టి గురించి తెలియక పోవచ్చు. గొప్ప సంఘసంస్కర్త _డాక్టర్ హెగ్డేవార్. డా||కేశవ్ బలీరాం హెడ్గేవార్ మన జాతికే కాదు యావత్ మానవాళికీ తోడ్పడ్డారు. హిందూ జాతి పునర్ వికాసానికి శక్తి వంతమైన జాతి నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త . నిత్యం జరిగే అర్ 'ఎస్ 'ఎస్ శాఖ ను వ్యక్తిత్వ నిర్మాణానికి వికాసానికి 'ఐక్యతా శక్తికి వేదికగా మార్చిన రూపశిల్పి. ధర్మ రక్షణ పునాదుల మీద దేశరక్షణకు అవిరళ కృషి చేసిన ఆదర్శ పురుషుడు హెగ్దేవార్. యుగ దృష్ట _డాక్టర్ హెగ్డేవార్ . కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటి వారు భౌతికంగా ప్రజలకు దూరమైనా, వారిని అనుసరించే వారు పెరుగుతూనే ఉంటారు. అటువంటి మహా పురుషులు తమకు ప్రజలలో పేరు ప్రఖ్యాతులు రావాలనీ, విస్తృత ప్రజానీకానికి తాము పరిచయం కావాలని కోరుకోరు. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా|| హెడ్గేవార్ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు. ఆర్ 'ఎస్' ఎస్ పెద్ద సంఖ్యలో స్వచ్చంధ సేవకులను నిర్మాణం చేస్తుంది. దేశం సంక్షోభ సమయంలో దేశానికి సేవ చేయగల వ్యక్తులను మంచి తనం మానవీయత సమర్పణ భావం సంస్కారవంతమైన సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఆర్ 'ఎస్' ఎస్ యొక్క లక్ష్యం నేను కాదు_ మనం అనే సమిష్టి భావన పరివ్యాప్తి_ ఆర్ 'ఎస్ 'ఎస్. నేను ఒంటరిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం నాది. ఆది నాతోనే ఉంటుంది అని హిందూ సమాజం నరనరాల్లో నేను కాదు మనం అనే భావన ఇంకిపోవాలనే ఆలోచించి స్థాపించిన ఆర్ ఎస్ ఎస్ వ్యక్తుల్లో సమష్టి భావన వ్యాప్తిలో కృతకుత్త మైందనీ చెప్పవచ్చు. భారత్ మాతాకీ జై నినాదం_ ఐక్యతా మంత్రం. సంఘ శాఖలో దేశంలో వేర్వేరు సాంప్రదాయాలు పాటించే వారు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ముక్త కంఠంతో భారత్ మాతాకీ జై అని నినదిస్థారు. ఇది ఒక ఐక్యతా మంత్రం.తద్వారా భారతదేశం నాదేశం అనే భావన బలపడుతుంది. అంటరాని తనం 'భాషాబేధం 'ప్రాంత బేధం అంతరించి పోతుంది. అందరిని ఒకే విధంగా ప్రేమించడం .'సమానత్వం పాటించడం జరుగుతుంది. అధికార బోధ కాకుండా కర్తవ్య బోధజాగృతమౌతుంది. సంఘం పరిది _విస్తరణ. సంఘం తన కార్యక్రమాలు ప్రారంభించుకొని 99 సంవత్సరాలు పూర్తయింది. సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ కార్యపరిధిని మరింత విస్తృత పరచడంకోసం సంఘ ఆలోచన పరివ్యాప్తి కోసం జాతీయవాద శక్తుల బలోపేతం ద్వారా దేశ రక్షణ ధర్మ రక్షణలో పౌరసమాజం క్రియా శీలక పాత్రను చోదక శక్తిగా తీర్చిదిద్దాలని సంకల్పంచడం జరిగింది. ఐదు అంశాలు ఎంపిక. సంఘ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 5 అంశాలను ఎంపిక చేయడం జరిగింది. సామరస్యత_ సంస్కారం. 1)వ్యక్తిగత కుటుంబ సామాజిక వ్యవహారాలు సామరస్య పూర్వకంగా జరగాలి. అంటరాని తనం నిర్మూలించబడాలి. కుటుంబాల్లో సంస్కారం పెరగాలి పర్యావరణ రక్షణ. 2) పౌరసమాజం పర్యావరణ రక్షణ 'నీటి వినియోగం 'నీటి సంరక్షణ ప్రతి వ్యక్తి పుట్టిన రోజు ఒక మొక్కను నాటడం కాలుష్య నివారణ 'ప్లాస్టిక్ వినియోగం రద్దు. తప్పని సరి ఓటు హక్కు. 3)సామాజిక బాధ్యతలను నిర్వహించడం తప్పని సరి ఓటు హక్కును వినియోగించాలి. స్వదేశీ _స్వాభిమానం. 4) స్వదేశీ భావన పరివ్యాప్తి చేయడం స్వాభిమానం ఉపాధిఅవకాశాలను మెరుగుపరచడం. ప్రతి ఒక్కరు ఖద్దరు వస్త్రాన్ని ధరించడం. 5) సహజ వనరుల రక్షణ దేశ భాషల పట్ల స్వాభిమానాన్ని పెంచడం. భూకంపం వరదలు తుపాను అకాల ప్రకృతి విపత్తులు కుంభమేళాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చే సమాజ సేవకులను ఆర్ ఎస్ ఎస్ తయారు చేస్తుంది మనం అనే భావనతో సేవాకార్యక్రమాలు. దేశంలో ప్రస్తుతం స్వయం సేవకుల ద్వారా మనం అనే భావన తో 160000సేవా కార్యక్రమాలు జరుగు తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలు భారత దేశానికే పరిమితం కాలేదు. హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో ప్రపంచములో 80 దేశాల్లో విస్తృతంగా పనిచేస్తుంది. సమాజంలో కర్తవ్య భావనను జాగృతం చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో వలస కూలీలకు ఆహారం నివాసం ఇచ్చి ఆదుకొని ఆపన్న హస్తం అందించిన సమస్త మానవ కళ్యాణం కోసం నిరంతర కృషి చేసే సంస్థ కార్యకలాపాల విస్థ్రరణకు స్ఫూర్తి దాతగా నిలిచిన హెగ్దేవార్ జయంతిని స్మరించుకోవడం వారి ఆశయాల సాధనకు పనిచేసే స్ఫూర్తిని మనలో నింపిన ఆధునిక యుగ ద్రష్ట ప్రవక్త గా నిలవడం భారత జాతికి గర్వకారణం. నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం కరీంనగర్ 9440245771

By NYALAKONDA ANIL DESAI | June 21, 2025 | 0 Comments

అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా?

అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా? * వెంటనే ప్రకటించి అర్హులందరికీ వెంటనే కార్డులివ్వాలి * డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ * జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తాం * పాత చట్టాలను సవరించాలి హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధివిధానాలను వెంటనే ప్రకటించి , అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కార్డులు ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ఠ్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని సరళీకృతం చేయాలని సూచించారు. ఏడాది నుంచి ఈ అంశాన్ని తేల్చకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పటిష్ఠమైన ఇన్సూరెన్స్ , ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ అంశాలపై ప్రధాని మోదీకి విన్నవిస్తామని చెప్పారు. జర్నలిజం ప్రింట్ మీడియా నుంచి మొదలై వివిధ రూపాలకు విస్తరించినందున పాత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రక్రియలో పాత్రికేయులకూ భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గెజిటెడ్ అధికారులకు కల్పించే సౌకర్యాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలన్నారు. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. వారు దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నా సామాజిక అంశాల్లో జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.‌ వారిలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత తదితర అంశాల్లో వెనకబడి జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని, దేశమంతా ఇదే స్థితి ఉందన్నారు. వారి పక్షాన పోరాడేందుకే వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఆవిష్కరించిందన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ సభ్యులు ఉన్నారని సంజయ్ ఉపాధ్యాయ తెలిపారు. జాతీయ స్థాయిలో బీఎంఎస్ కు అనుబంధంగా పని చేస్తున్నామని, త్వరలో నేపాల్ కు కూడా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. నేడు విద్యా సదస్సు, పాత్రికేయులకు పురస్కారాలు జాతీయ విద్యావిధానం-2020, మీడియా పాత్ర అనే అంశంపై డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ ‌సెమినార్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూజేఐ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఉత్తమ జర్నలిస్టులకు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. రా‌ష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ‌ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జర్నలిస్ఠులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | June 14, 2025 | 0 Comments

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సెక్యులరిజం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సెక్యులరిజం’ మీకు మర్కజ్ రవి అనే పేరు గుర్తుందా? మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం. రవి అనేది సాధారణంగా హిందువులు పెట్టుకునే పేరు. అలాంటిది ఆ రెండింటికీ ముడి ఎలా పడింది? తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే ఈనాడు, మర్కజ్‌ సమావేశానికీ రవి అనే వ్యక్తికీ ముడి పెట్టింది. ‘మర్కజ్ రవి’ కథ: కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో, అంటే 2020 మార్చి 13న ఢిల్లీలో జరిగిన ముస్లిముల సమావేశం (మర్కజ్) జరిగింది. దానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది వెళ్ళారు. వారిలో చాలామందికి కరోనా వ్యాధి సోకింది. వారి ద్వారా మరికొన్ని వేల మందికి ఆ మహమ్మారి సోకింది. అలా ఢిల్లీ వెళ్ళిన వారిలో హైదరాబాద్ అమీర్‌పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సహజంగానే, అతనొక ముస్లిం వ్యక్తి. మార్చి 13న జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి, మార్చి 18న హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ పూర్తయిన కొద్ది రోజులకు పరీక్షలు చేసినప్పుడు అతనికి అనూహ్యంగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అతని ద్వారా మరెంతో మందికి ఆ మహమ్మారి సోకింది. 12 ఆ సంఘటనకు సంబంధించి ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ వ్యక్తి పేరు ‘రవి’ అని రాసింది. మర్కజ్ కోసం ‘రవి’ ఢిల్లీ వెళ్ళి వచ్చాడనీ, అతనికి కోవిడ్ సోకిందనీ రాసుకొచ్చింది. అయితే మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం అన్న సంగతిని మాత్రం రాయలేదు. ఆ సమావేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు. బాధితుల పేర్లు బైటపెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాసారు, ఆ విషయాన్ని వెల్లడించారు. అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం? అతను వెళ్ళిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించినది అన్న విషయం మెజారిటీ ప్రజలకు తెలియని తెలుగు రాష్ట్రాల్లో చెలామణీలో ఉన్న ఆ దినపత్రిక, సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది? నిందితుల పేర్లు దాచడం దేనికి? హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికల్లో ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతుంటాయి. వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదులుస్తానని నమ్మించి వారిని లైంగికంగా లోబరచుకోవడం, వేధించుకోవడం లాంటి వార్తలు తరచుగా కనిపిస్తాయి. హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అలాంటి వార్తలు వెలుగు చూస్తుంటాయి. అలాంటి వార్తలను నిశితంగా చూస్తే, చాలా వరకూ కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు. కానీ పత్రికలు మాత్రం ఉద్దేశ పూర్వకంగా తాంత్రికుడు, బాబా అనే పదాలు ఉపయోగించి, ఆ వార్తను ప్రచురిస్తాయి. అలాంటి సంఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ‘కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బైటపెట్టకూడదు’ అనే నియమం మంచిదే. కానీ ఆ పేరు హిందువుదే ఎందుకు అయి ఉంటుంది? ఏ క్రైస్తవ పేరో లేక ముస్లిం పేరో అయి ఉండవచ్చు కదా… అలా మాత్రం జరగదు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మర్కజ్ కరోనా కేసులో బాధితుడి పేరు బైట పెట్టకూడదంటే ఏ అబ్దుల్ అనో కరీం అనో నయీం అనో పెట్టవచ్చు కదా… అలా రాయలేదు. అలాగే తంత్రగాళ్ళు, దొంగ బాబాలు అని రాసే బదులు ఫకీర్, మౌల్వీ, మౌలానా అనే పదాలు వాడవచ్చు కదా. అలాగే క్రైస్తవ పాదరీల అకృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మతగురువు అని రాస్తారు. అదంతా ఏంటంటే… హిందూ మత పెద్దలు దొంగలు, మోసగాళ్ళు, నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం… హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్తులలోనే నమ్మకం లేకుండా చేయడం. అది ఉద్దేశపూర్వకమా, యాదృచ్ఛికమా అన్నది చెప్పడం కష్టమే. కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో హిందూ మతం అంటే ఒక రకమైన తేలిక భావం, చులకన భావం, క్రమంగా హిందుత్వం అంటే విముఖత కలిగేలా అలాంటి వార్తలు ఉంటున్నాయి. ఈ రకమైన ప్రచారం కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామమే. రకరకాల నేరాలకు పాల్పడిన ముస్లిం పీర్లు, మౌలానాలు, ఫకీర్లను తాంత్రికుడు లేక బాబా అని వ్యవహరిస్తూ వార్తలు రాసిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి రాతలను చదివే పాఠకుల మనసుల్లో హిందూ మతగురువుల పట్ల విద్వేష భావం పెచ్చరిల్లుతుంది. అలాంటి కొన్ని ప్రధానమైన సంఘటనల వివరాలు చూద్దాం…. (1) మంద్‌సౌర్, మధ్యప్రదేశ్‌: ముబారక్ మన్సూరీ అనే వ్యక్తి చేతబడి, బాణావతి వంటి వాటిని వదిలిస్తాననే సాకుతో హిందూ మహిళలను లొంగదీసుకునేవాడు. వారితో అనునయంగా మాట్లాడి ప్రేమ ముగ్గులోకి దింపేవాడు. బాధిత మహిళలకు తెలియకుండా వారికి మత్తు పదార్ధాలు ఇచ్చేవాడు. వారు తెలివి కోల్పోయాక వారిని మానభంగం చేసేవాడు. అలా కనీసం 50 మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2025 మే 20న ఒక బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు మే 22న అతని ఇంట్లో సోదాలు చేసారు. ఆ రోజే అతన్ని అరెస్ట్ చేసారు. మే 24న కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కణ్ణుంచి జైలుకు పంపించారు. మంద్‌సౌర్‌ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి మే 29న ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఒక కథనం ప్రచురించింది. ‘‘తాంత్రికుడి వేటుకు బలైన 40-50 మంది మహిళలు’’ అన్నది ఆ కథనం శీర్షిక. ఎంపీ 44 న్యూస్ అనే స్థానిక న్యూస్ ఛానెల్ కూడా అలాగే హెడ్‌లైన్ పెట్టింది. ‘‘భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు’’ అన్నది ఆ ఛానెల్ శీర్షిక. స్టేట్ మిర్రర్ అనే పత్రిక ‘‘మంత్ర తంత్రాల పేరుతో ప్రేమ వల : 40-50 మంది హిందూ మహిళలపై అత్యాచారం చేసిన తాంత్రికుడు’’ అనే కథనాన్ని ప్రచురించింది. (2) మేరఠ్, ఉత్తరప్రదేశ్: చేతబడి వదిలిస్తానంటూ రషీద్ ఖాన్ అనే వ్యక్తి 17 ఏళ్ళ హిందూ బాలికను లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు, ఆభరణాలూ, విలువైన వస్తువులూ తీసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయిని వదిలిపెట్టి పరారైపోయాడు. అతని అకృత్యాలు వెలుగు చూడడంతో, రషీద్ ఖాన్ పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఈ యేడాది జనవరి 25న అతన్ని, అతని సహాయకులు ముగ్గురినీ అరెస్ట్ చేసారు. ఆ సంఘటన గురించి ఈటీవీ భారత్ 2025 జనవరి 11న కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మేరఠ్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు, మంత్ర తంత్రాల పేరిట నగదు, నగలతో పరారీ’’ అని హెడ్‌లైన్ పెట్టింది. అదే రోజు ‘దైనిక్ భాస్కర్’ పత్రిక దాదాపు అలాంటి పతాక శీర్షికతోనే కథనం ప్రచురించింది. ‘‘మేరఠ్‌లో మైనర్ అమ్మాయి కిడ్నాప్, దుష్టశక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగదీసుకున్న మంత్రగాడు, 6 లక్షల నగదు, ఆభరణాలూ ఎత్తుకుపోయాడు’’ అని ఆ శీర్షిక. ఆజ్‌తక్‌ ఛానెల్ 2025 జనవరి 12న కథనం ప్రసారం చేసింది. దాని హెడ్‌లైన్ ‘‘మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు, అతనికి ఆరుగురు పిల్లలు’’. అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ9 భారత్‌వర్ష్ 2025 జనవరి 13న కథనం ప్రసారం చేసింది. దాని శీర్షిక ‘’17 ఏళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మర్నాడు పెద్ద గొడవ జరిగింది. ఎందుకో తెలుసా?’’ ఆ కథనానికి సంబంధించిన థంబ్‌నెయిల్‌లో పట్టుపంచె కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తిమీద చెయ్యి పెట్టి ఉన్నట్లు ప్రచురించారు. దాన్ని చూస్తే ఓ హిందూ మాంత్రికుడు అమ్మాయిని ఏదో చేస్తున్నాడు అనే ఉద్దేశం కలిగేలా ఉంది. ఇంకా మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే ప్రచారం చేసాయి. నిజానికి రషీద్ ఖాన్ ముస్లిమే తప్ప హిందువు కాదు. హిందూ బాలికలను ఆకట్టుకుని ప్రలోభపెట్టి వారిని లొంగదీసుకుని నగలు, నగదు ఎత్తుకుపోవడం అతని పద్ధతి. మీడియా సంస్థలు మాత్రం మైనర్ అమ్మాయిని ఎత్తుకుని పోయిన మాంత్రికుడు/మంత్రగాడు అన్న కోణంలో కథనం ప్రసారం చేసారు. (3) ఢిల్లీ: ఇది 2024 ఆగస్టు నాటి ఘటన. మహమ్మద్ షరీఫ్ అనే దుర్మార్గుడు 12ఏళ్ళ అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్ళి ఆ చిన్నారిని మానభంగం చేసాడు. ఆ చిన్నపిల్లకు దెయ్యం పట్టిందని, దానివల్లనే ఆమె తండ్రికి అనారోగ్యం కలిగిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తాననీ నమ్మబలికి ఆ బాలికను శ్మశానానికి తీసుకువెళ్ళాడు. వాడే ఒక దెయ్యంగా మారి ఆ చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడు షరీఫ్‌ను అరెస్ట్ చేసారు. మీడియా యధావిధిగా ఈ కేసు విషయంలో కూడా నిందితుడు ముస్లిం మతస్తుడు అనే విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. అమర్ ఉజాలా ఆగస్టు 28న ప్రచురించిన వార్తకు ‘పన్నెండేళ్ళ బాలికపై మంత్రగాడి ఘాతుకం, తండ్రి జబ్బు నయం చేస్తానని చెప్పి దారుణం’ అని పతాకశీర్షిక ఉంచింది. ఇండియా టుడే పత్రిక కూడా అదేరోజు ‘చేతబడికి విరుగుడు పేరిట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. ఏబీపీ న్యూస్ ఛానెల్ ఆగస్ట్ 29న ప్రసారం చేసిన వార్తకు ‘ఢిల్లీలో మంత్రగాడి దారుణం, శ్మశానంలో 12ఏళ్ళ చిన్నారి బాలికపై బలాత్కారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు’ అని హెడ్‌లైన్ పెట్టింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ‘12ఏళ్ళ చిన్నారిని చిదిమేసిన 52ఏళ్ళ మాంత్రికుడి అరెస్ట్’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. దాని సోదర సంస్థ ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’12 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధించిన మంత్రగాణ్ణి పట్టుకున్న పోలీసులు’ అని హెడ్‌లైన్ పెట్టింది. (4) ముంబై, మహారాష్ట్ర: మెహదీ కాశిం షేక్ అలియాస్ మెహదీ హసన్‌ ఆరుగురు మైనర్ బాలికలు సహా ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసాడు. ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేసాడు. నవంబర్ 2010లో నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. 2016 ఏప్రిల్‌లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆ వార్త గురించి 2016 ఏప్రిల్ 13న నవభారత్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ‘‘ఆరుగురు మైనర్లు సహా ఏడుగురిని రేప్ చేసిన ‘బాబా’కు జీవిత ఖైదు’’ అన్నది దాని శీర్షిక. తర్వాత 2024 మార్చి 4న లైవ్ లా వెబ్‌సైట్‌లో ఆ ఘటన గురించి ఒక కథనం ప్రచురించారు. మెహదీ కాశిం షేక్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది. అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ‘‘ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా’’ అని హెడ్డింగ్ పెట్టింది. 2024 మార్చి 5న టీవీ9 భారత్‌వర్ష ఛానెల్ కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మంత్ర తంత్రాల తర్వాత రేప్ చేస్తాడు… ఆరుగురు చిన్నపిల్లలని రేప్ చేసిన మంత్రగాడు… ఇకపై జీవితమంతా జైల్లోనే’’ అని హెడ్‌లైన్ పెట్టింది. (5) ముంబై, మహారాష్ట్ర అబూబకర్ మొహమ్మద్ అలీ షేక్ పంథా చాలా తేడా. క్యాన్సర్ తగ్గించేస్తా అని హామీలు ఇచ్చేస్తాడు. అమెరికా వీసా ఇప్పించడానికి సాయం చేస్తా అంటాడు. మాటలతో కోటలు కట్టేస్తాడు. ఇతని బాధితుల్లో అత్యధికులు ముస్లిం మహిళలే ఉండడం గమనార్హం. 2024లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఆ వార్తను హిందుస్తాన్ టైమ్స్ పత్రిక 2024 ఫిబ్రవరి 1న ప్రచురించింది. దానికి పెట్టిన శీర్షికలో యధావిధిగా మంత్రగాడు అని పేర్కొంది. ‘క్యాన్సర్ నయం చేస్తా, యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళలను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్’ అన్నది ఆ శీర్షిక. (6) అమ్రోహా, యూపీ: గుర్తు తెలియని వ్యాధికి చికిత్స చేస్తామంటూ ఒక పదిహేనేళ్ళ బాలికను గ్యాంగ్‌రేప్ చేసారు నలుగురు దుర్మార్గులు. ఆ సంఘటన 2021 జులైలో జరిగింది. నిందితుల పేర్లు అఫ్జల్ మలిక్, తారిక్, అస్లమ్, జుల్ఫికర్. వాళ్ళు నలుగురూ ముస్లిములే అయినప్పటికీ హెడ్‌లైన్స్ చదివితే లేక వింటే ‘వాళ్ళెవరో హిందువులే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు’ అని ప్రజలు పొరబడడం ఖాయం. 2021 జులై 6న ‘లైవ్ హిందుస్తాన్’ ఛానెల్‌లో ఈ నేరం గురించిన వార్త ప్రసారం చేసారు. ‘‘తంత్ర మంత్రాలతో రోగాలు తగ్గిస్తామంటూ అమ్రోహాలో బాలిక మానభంగం, నలుగురు దుండగులపై కేసు నమోదు, దర్యాప్తు మొదలు’’ అని హెడ్‌లైన్ పెట్టారు. అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్తులు అనే భ్రమ కలిగించారు. జులై 7న ఆజ్‌తక్‌లోనూ అదే రకమైన కథనం ప్రసారమైంది. ‘‘చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన మాంత్రికులు, పరారీలో నిందితులు’’ అన్నది దాని హెడ్‌లైన్. జులై 7నే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని ప్రచురించింది. ‘‘రోగంతో బాధపడుతున్న 15ఏళ్ళ అమ్మాయిపై బలాత్కారం చేసిన మంత్రగాడు, అతని శిష్యులు’’ అన్నది వారి హెడ్‌లైన్. టైమ్స్ నౌ ఛానెల్ కూడా తక్కువేమీ తినలేదు. ‘‘చికిత్స సాకుతో అమ్రోహా అమ్మాయిని రేప్ చేసిన మేరఠ్ మంత్రగాడు’’ అనే హెడ్‌లైన్‌తో జులై 7న కథనం ప్రసారం చేసింది. (7) లఖ్‌నవూ, ఉత్తరప్రదేశ్: 2020లో లఖ్‌నవూ నగరంలో ఓ మజార్‌లో సెక్స్ రాకెట్ పట్టుబడింది. మజార్ అంటే అరబిక్‌లో సమాధి క్షేత్రం అని అర్ధం. ముస్లిములు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట పనిచేస్తున్న నాసిర్ అక్కడకు వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు, ఆ మజార్‌లోనే వ్యభిచార ముఠా కూడా నడుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నాసిర్‌ను అరెస్ట్ చేసారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఆ వార్తను ప్రచురించింది. షరా మామూలుగానే ఆ కథనానికి ‘‘మంత్రగాడి లైంగిక వేధింపుల వీడియో వైరల్ అవడంతో అరెస్టు చేసిన పోలీసులు’’ అనే హెడ్‌లైన్ పెట్టింది. (8) నయాపురా, మధ్యప్రదేశ్: 2020 జూన్ నెల. అంటే కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయం. మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలోని నయాపురా ప్రాంతంలో అస్లం అనే ఒక ముస్లిం గురువు ఉండేవాడు. అతను ఎవరి చేతి మీద ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి కరోనా వైరస్ సోకదు అని ప్రచారం చేసుకున్నాడు. దాంతో అతన్ని నమ్మే భక్తులు ఎగబడి వెళ్ళారు. అతని చేతిని ముద్దాడి తమకు కరోనా వైరస్ సోకదు అనే నమ్మకంతో ఆనందంగా ఉన్నారు. అయితే, అస్లంకే కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. అంతే కాదు, కోవిడ్ మహమ్మారి కారణంగా అస్లం 2020 జూన్ 4న చనిపోయాడు. అస్లం మరణంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని దగ్గరకు వచ్చేవారి వివరాలు కనుక్కుని వారందరికీ టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో 29మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడైంది. అస్లం సంఘటన తర్వాత నయాపురా, రత్లాం ప్రాంతాల్లో ఇలాంటి ముస్లిం గురువులు 37మందిని క్వారంటైన్ చేసారు. ఇంత ప్రమాదకరమైన సంఘటన విషయంలో కూడా సదరు వ్యక్తి ముస్లిం అన్న విషయాన్ని మీడియా యథాశక్తి దాచిపెట్టింది. ‘చేతి మీద ముద్దు పెట్టే బాబా’ అనే కోణానికే ప్రాధాన్యం ఇచ్చింది. బాబాలు, గురువుల్లో ఇలాంటి మోసగాళ్ళు మాత్రమే ఉంటారు అనే భావన ప్రజల్లో కలిగించేలా చేసింది. వారు ముస్లిములు అనే విషయాన్ని దాచిపెట్టడం ద్వారా హిందూ మత గురువులు, బాబాలు మాత్రమే అలాంటి పనులు చేస్తారని పరోక్షంగా అర్ధమయేలా చేసింది. ప్రభాత్ ఖబర్ పత్రిక ‘‘చేతిని ముద్దాడి కరోనాకు బాబా చికిత్స, ఆయన దగ్గరకు వెళ్ళిన 19మందికి కరోనా పాజిటివ్, ప్రజల్లో భయాందోళనలు’’ అనే శీర్షిక పెట్టింది. ఆజ్‌తక్ ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుపెట్టి ‘వైద్యం’ చేసే బాబా కరోనాతో మృతి, 29మంది భక్తులకూ కరోనా పాజిటివ్’’ అని హెడ్‌లైన్ రన్ చేసింది. ఎన్‌డిటివి ఇండియా ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుతో చికిత్స చేసే మంత్రగాడు కరోనాతో మృతి, ఆయననుంచి 23మందికి సంక్రమించిన కోవిడ్, మరో 37మంది బాబాలను క్వారంటైన్ చేసిన యంత్రాంగం’’ అని శీర్షిక ఉంచింది. (9) నదియా, పశ్చిమ బెంగాల్: బెంగాల్‌లోని నదియా జిల్లా కామ్‌ఠాల్‌బేరియా గ్రామంలో అల్పనా బీబీ అనే ఒక ఆడ ముస్లిం ఫకీర్ ఉండేది. మంత్రతంత్రాలతో చికిత్స చేస్తానంటూ ఆమె ప్రజలను ఆకట్టుకునేది. 2019 సెప్టెంబర్‌లో అర్ఫినా బీబీ అనే మహిళ తన పిల్లలను అల్పనా బీబీ దగ్గరకు తీసుకువెళ్ళింది. పదేళ్ళ పిల్లవాడు జాన్ నబీ షేక్, ఆరేళ్ళ పిల్లవాడు జహంగీర్ షేక్‌లకు ఆమె చికిత్స చేసింది. అయితే జాన్ నబీ షేక్ చనిపోయాడు. జహంగీర్‌కు ఒళ్ళంతా గాయాలయ్యాయి. పిల్లలను తీసుకువెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ విషయం తెలిసి నిర్ఘాంత పోయారు. ఆ పిల్లల శరీరాలను తనిఖీ చేస్తే… వాళ్ళ వీపుల మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అల్పనా బీబీ చికిత్ పేరిట ఆ పిల్లల వీపుల మీద వేడివేడి నూనె పోసింది. దాని మీద కారం చల్లింది. ఆ మంట తట్టుకోలేక జాన్ నబీ షేక్ ప్రాణాలు వదిలేసాడు. విషయం బైటపడేసరికి కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు అల్పనా బీబీని అరెస్ట్ చేసారు. మీడియా తన పని తాను చేసుకుంటూ పోయింది. నిందితురాలి ఉనికిని దాచిపెట్టి ఓ మంత్రగత్తె అంటూ ముద్ర వేసేసింది. ‘‘పశ్చిమ బెంగాల్‌లో మైనర్ బాలుడి మరణం, మంత్రగత్తె అరెస్ట్’’ శీర్షికతో హిందుస్తాన్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది. ‘‘తంత్ర పూజల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో పదేళ్ళ బాలుడి మరణం’’ అని ఎన్‌డీటీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘పదేళ్ళ బాలుడి మరణంతో మంత్రగత్తె అరెస్ట్’’ అని ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. యథావిధిగా ఈ మీడియా సంస్థలన్నీ నిందితురాలు ముస్లిం మహిళ అన్న విషయాన్ని దాచి పెట్టాయి. (10) బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్: 2019 మే నెలలో సంఘటన ఇది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కు చెందిన ఒక 34 ఏళ్ళ మహిళకు భర్తతో విభేదాలు వచ్చాయి, అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మరికొన్ని కుటుంబ సమస్యలూ ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఆమె అస్లం ఫైజీ అలియాస్ సుహైల్ రజా అనే 28 ఏళ్ళ మౌల్వీని ఆశ్రయించింది. అతను ఆవిడ సమస్యను పరిష్కరిస్తానని మాటిచ్చాడు. ఆ క్రమంలో మౌల్వీ దగ్గరకు వెడుతుండేది. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ మౌల్వీ, ఆ మహిళను బెదిరించి ఆమెపై అఘాయిత్యం చేసాడు. కొన్ని రోజుల్లోనే ఆమె సమస్యలు పరిష్కారమైపోతాయి అని మభ్యపెట్టాడు. మౌల్వీ చెప్పిన గడువు గడిచిపోయినా ఆ మహిళ భర్త తిరిగి రానూ లేదు, ఆమె కుటుంబ సమస్యలూ పరిష్కారం కాలేదు. మౌల్వీ తనను మోసం చేసాడనీ, శారీరకంగా వాడుకున్నాడనీ అర్ధమయ్యాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మౌల్వీని అరెస్ట్ చేసారు. ఈ వార్తను నయీ దునియా పత్రిక 2019 మే 26న ప్రచురించింది. యధావిధిగా, మహిళపై అఘాయిత్యం చేసిన మంత్రగాడు అని రాసుకొచ్చింది. అంతే కాదు, ఆ కథనానికి వాడిన బొమ్మలో రుద్రాక్షలు ధరించి, పట్టుబట్టలు కట్టుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకున్న వ్యక్తి చిత్రాన్ని ప్రచురించింది. అంటే హిందూ మంత్రగాడు మహిళను లోబరచుకుని బలవంతంగా ఆమెను అనుభవించాడు అనే అర్ధం వచ్చేలా ఆ కథనం చెప్పకనే చెప్పింది. (11) హర్యానా: గుర్గావ్‌ సమీపంలోని సోహ్నా గ్రామానికి చెందిన దీన్ మొహమ్మద్ అలియాస్ దీనూ వయసు 65 ఏళ్ళు. అతనికి ముగ్గురు భార్యలు, పది మంది సంతానం ఉన్నారు. 2002లో అతను స్థానిక గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగానూ పని చేసాడు. తనకు దెయ్యాలు భూతాలను వదిలించగల శక్తి ఉందని, అనారోగ్యాలను బాగు చేస్తానంటూ చెప్పుకుంటూ దీనూ ఆడవాళ్ళను ఆకట్టుకునేవాడు. వాళ్ళను లైంగికంగా వేధించేవాడు. తమ చెడు అనుభవాల గురించి బైటకు చెప్పుకోలేని మహిళలు మౌనంగా ఉండిపోయారు. 2016లో ఒక 19 ఏళ్ళ యువతికి అనారోగ్యంతో బాధ పడుతుంటే తల్లిదండ్రులు ఆమెను దీనూ దగ్గరకు తీసుకువెళ్ళారు. యువతి అనారోగ్యాన్ని తగ్గిస్తాననే వంకతో దీనూ ఆమెను పలుమార్లు బలాత్కరించాడు. అంతే కాదు, ఆ యువతిని చికిత్స కోసం తీసుకువెళ్ళిన ప్రతీసారీ ఆమె తండ్రి దగ్గర నుంచి రూ. 5వేలు వసూలు చేసేవాడు. చివరికి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు 2016 జులై 31న సదర్ గుర్గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు దీన్ మొహమ్మద్‌ను, అతనికి సహకరించిన దరాబ్ ఖాన్ అనే అనుచరుణ్ణీ అరెస్ట్ చేసారు. ఈ నేర వార్తను మీడియా యధావిధిగా మంత్రగాడు, మాంత్రికుడు చేసిన నేరం అనే కోణంలోనే ప్రచురించింది. పైగా రుద్రాక్ష మాలలు ధరించి, బొట్టు పెట్టుకున్న మనిషి బొమ్మలు ముద్రించడం ద్వారా నేరస్తుడు ఒక హిందూ మంత్రగాడు అనేలా ప్రజల్లోకి విషయం వెళ్ళేలా చేసారు. ఇంక పతాక శీర్షికల్లో కూడా మంత్రగాడు అనే పద ప్రయోగంతో ఎవరో హిందువే నేరానికి పాల్పడ్డాడు అనే భావం కలిగేలా రాసుకొచ్చారు. బిజినెస్ స్టాండర్డ్, ఇండియాటుడే పత్రికలు ‘‘హర్యానాలో టీనేజ్ యువతిని రేప్ చేసిన మంత్రగాడి అరెస్ట్’’ అని హెడ్‌లైన్ పెట్టాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకడుగు ముందుకువేసి ‘‘పదిమంది పిల్లల తండ్రి అయిన గుర్‌గావ్ మంత్రగాణ్ణి యువతి రేప్ కేసులో అదుపులోకి తీసుకున్నారు’’ అని రాసుకొచ్చింది. ఉపసంహారం: ఈ వార్తలన్నీ చూస్తే మనకు అర్ధమయ్యేది ఒకటే. ఈ దేశపు మీడియాకు హిందువులంటే ప్రేమ లేదు. ముస్లిములు చేసిన అకృత్యాలను సెక్యులరిజం ముసుగులో దాచి పెడతారు. చాలా సందర్భాల్లో మాత్రం హిందువులే ఆ నేరాలకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలిగేలా చేస్తారు. అలాంటి సంఘటనల విషయంలో పాత్రికేయులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.

By NYALAKONDA ANIL DESAI | June 14, 2025 | 0 Comments

77 ఏళ్లుగా వెలుబడుతున్న ఏకైక జాతీయ వాద పత్రిక... గర్వించదగిన తెలుగు వార పత్రిక "జాగృతి"

*ఒక పత్రిక 10 వేల సైన్యం తో సమానం... *వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి.. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి... 1948 లో ప్రారంభమై 77 ఏళ్ళుగా వెలుబడుతున్న ఏకైక జాతీయవాద పత్రిక, గర్వించదగిన తెలుగు వార పత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జితెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వార పత్రిక జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనము బుధవారం రోజున సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఇట్టి ప్రోగ్రాం కు ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖపాత్రనుపోషించాయన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభ లాంటి ఎన్నో పత్రికలు ఉండేవని , ఆ తర్వాత ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వచ్చాయన్నారు. నేడు మీడియా రంగం ఎంతో విస్తరించిందన్నారు. డిజిటల్ , సోషల్ మీడియా తో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక పత్రికపదివేలసైన్యంతోసమానమన్నారు. కానీ నేడు వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు. భారతీయత మీద వక్ర భాష్యాల విషపుజల్లులుకురుస్తున్నాయన్నారు. ఏ పత్రిక అయినా సదాశయంతోనే ప్రారంభమవుతుందని, అర్థవంతమైన పేరు , ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్ర లో ఒకింత తక్కువేనన్నారు. జాతీయ భావజాలం తో, ధర్మం, రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వేలుబడుతు , ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వార పత్రిక జాగృతి యే నన్నారు. ప్రధానంగా జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తి సాము చేసిన ఘనత జాగృతి దే న్నారు. జాగృతి ముఖ్యంగా జాతీయ భావాజాలను వ్యాప్తం చేసిందని, ప్రజల అవసరాలను గుర్తించి, ఎన్నో రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేసిందన్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానీకే శ్రమిస్తుందన్నారు. ఇలాంటి పత్రికను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రజలతో మమేకమవుతూ సమాజం కోసం పలువిధాలపాటుపడుతుందన్నారు.. నేడు దేశంలోని సామాజిక రంగాల్లో ప్రవేశించి, ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి. దురిశెట్టి నిరంజన చారి , పాక సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, కిషన్ జి, బాలరాజు , తడగోప్పు ల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్ , మహేశ్వర్ , పుల్లూరి రామారావు , మురళీజీ , పరుశరాం జి తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | May 21, 2025 | 0 Comments

మే డే ను బహిష్కరించాలి. బి ఎం ఎస్

పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన మేడేను బహిష్కరించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరపాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా మే డే ను నిర్వహిస్తలేరు కానీ మనదేశంలో మాత్రం ఉనికి కోసం స్వలాభాల, రాజకీయాల కోసం కొంతమంది మే డేను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ సప్త కులాలకు పనిముట్లు అందించిన ఆది గురువు విశ్వకర్మ ని కొనియాడారు. అలాంటి మహానుభావు ల జయంతిని నిర్వహించకుండా ఎక్కడో ఏదో జరిగిందని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని స్వదేశం తిండి తింటూ విదేశీ పాట పాడుతున్నారని విదేశీ సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశ కార్మికులపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలతో నేటికీ కార్మిక వర్గానికి న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా భారత కార్మిక దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

By NYALAKONDA ANIL DESAI | April 29, 2025 | 0 Comments

యు డైస్ వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం

యు డైస్ వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం * జనంగొంతు పెద్దపల్లి ఓదెల ఈరోజు తేదీ 21.04.2025 న మండల కేంద్రంలోని ఎం ఆర్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు డైట్ కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం ఎర్ర రమేష్ మండల విద్యాధికారి ఓదెల ఆధ్వర్యం లో జరిగింది. ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు కుమారి అఖిల మరియు కుమారి అమూల్య చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది దీనిలో భాగంగా యు డైస్ లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్ పరికరాలు క్రీడా స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, వంటగది గార్డెన్ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది. కావున ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఓదెల మండల ఎం ఆర్ సి యందు డైట్ శిక్షణ ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారిని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వెంకటేష్ కుమార్ సి ఆర్ పి లు రజిత, ఓంకార్, రాజేందర్, తిరుపతిరావు, మరియు కాంప్లెక్స్ హెచ్ఎంలు సాంబయ్య, లక్ష్మీనారాయణ ,జ్యోతి ,మహేందర్ రెడ్డి ,అశోక్ ,నాగరాజ్ ,రమేష్ ,లు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | April 22, 2025 | 0 Comments

గడువులోపు రాజీవ్ యువవికాసం దరఖాస్తు సమర్పించాలి.*

జనం గొంతు పెద్దపల్లి ఓదెల* గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తు పత్రాలను ఎంపీడీవో కార్యాలయం లో ఇవ్వగలరు అని ఎంపీడీవో జి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తు ఫామ్స్ తో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్న సర్టిఫికెట్లు మరియు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో సహా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 12 గంటలకు అందజేయగలరని ఎంపీడీవో తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | April 22, 2025 | 0 Comments

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. బి ఎం ఎస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంక్షేమమును పూర్తిగా విస్మరించిందని తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మోహన్ రెడ్డి విమర్శించారు.ఆదివారం నాడు కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు.కార్మిక శాఖ అధికారుల ఇష్టారాజ్యమైందని ఆరోపించారు.భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని,అందువల్ల కార్మికులకు కొత్త రూల్స్ పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కార్మిక శాఖ అధికారులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం కాలంగా బోర్డు నుంచి అందాల్సిన పథకాల రూపాయలు అందట్లేవని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.15 సంవత్సరాల నుండి కార్మికులకు కనీస వేతనం పెంపుకు నోచుకోవట్లేదని,ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ,బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,ప్రదీప్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పసుల శ్రావణ్,తోర్తి శ్రీనివాస్,మోగిలిపాలెం తిరుపతి,సత్యం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | April 20, 2025 | 0 Comments

డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన ఎఃపీ ఈటల

హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని సోమవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం రాత్రి శామీర్ పేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వారు పాత్రికేయులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. డబ్ల్యూ జే ఐ కృషిని అభినందించారు. డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పాత్రికేయులకు, పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ఉపాధ్యక్షుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 31, 2025 | 0 Comments

బాధ్యతాయత జర్నలిజం నేటి అవసరం * రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

బాధ్యతాయత జర్నలిజం నేటి అవసరం * రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ * డబ్ల్యూజేఐ పంచాంగం ఆవిష్కరణ హైదరాబాద్: విలువలు, వాస్తవాలతో కూడిన బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రస్తుత సమాజానికి అవసరమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జర్నలిజం ప్రమాణాలను కాపాడేందుకు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ప్రతినిధులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అయన పేర్కొన్నారు. డబ్ల్యూజేఐ రూపొందించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆదివారం ఉదయం రాజ్ భవన్ లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాంగాన్ని డబ్ల్యూజేఐ ప్రచురిండాన్ని ఆయన అభినందించారు. ఈ తరహా ప్రయత్నాలు సాంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో, వాటిని నూతన తరం సులభంగా అర్థం చేసుకునేలా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు, ప్రజలకు గవర్నర్ తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. * జర్నలి‌స్టులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి * వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన పంచాంగాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో విడుదల చేశారు. పంచాంగాన్ని అందంగా ముద్రించిన డబ్ల్యూ జే ఐ ని అభినందించారు. ఈ సంవత్సరంలో డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు జర్నలిజంలో డబ్ల్యూ జే ఐ ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలని ... దేశహితానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో డబ్ల్యూ జే ఐ వేగంగా పురోగమించడం శుభ పరిణామమన్నారు...ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమాల్లో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర సలహాదారుడు శ్రీ మురళీమనోహర్, గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 30, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1