జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని సూక్ష్మ కళాకారుడైన స్వర్ణకారుడు బాలకృష్ణ వీరాభిమాని ఇల్లెందుల నాగేందర్ రేపు విడుదల కాబోయే అఖండ -2 చిత్రంలోని త్రిశూలాన్ని పంచ లోహాలతో స్వయంగా తయారుచేశాడు. ఈ త్రిశూలానికి గురువారం రోజు రాయికల్ పట్టణంలోని అతి పురాతనమైన గుడి కోట శ్రీ చెన్న కేశవనాథ ఆలయంలో అభిషేకం, పూజలు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లెందుల నాగేందర్ మాట్లాడుతూ అతి సూక్ష్మ త్రిశూలాన్ని స్వయంగా నేనే వెళ్లి నందమూరి బాలకృష్ణకు బహుకరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్, పిప్పోజి మహేందర్ బాబు, బూర్ల గంగన్న బత్తిని నిరంజన్ ఆలయ అర్చకులు మునుగోటి సతీష్ శర్మ పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పి సిఈవో బి. గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సోమవారం రోజున రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పి సిఈవో బి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. సీటింగ్ అరెంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క "బ్యాలెట్ పత్రం” కూడా బయటకు వెళ్లకూడదన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని, వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన చోట సహాయం అందిస్తారని, పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కూంఫు డో ఛాంపియన్ షీప్ -2025 లో భాగంగా రాయికల్ పట్టణానికి చెందిన శ్రీమణికంఠ కంప్యూటర్స్ & మీసేవ నిర్వాహకుడు గంట్యాల ప్రవీణ్ లక్ష్మీశ్రీ దంపతుల కుమారుడు గంట్యాల హర్షిత్ స్వర్ణ పథకం మరియు గంట్యాల హరిణి వెండి పథకాన్ని సాధించి అందరి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కుంగ్ ఫు డో మాస్టర్ కనుక ప్రభాకర్ తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల కృషి ఈ విజయానికి కారణమని అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కూంఫు కరాటే ఛాంపియన్ షీప్- 2025 లో కూంఫు డో,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కనుక ప్రభాకర్, కనుక ప్రవీణ్ కుమార్ మరియు హరికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రాయికల్ కు చెందిన 18 మంది కూంఫు డో విద్యార్థులకు 16 బంగారు పతకాలు, రెండు వెండి పథకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కూంఫు డో , మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం వల్ల శారీరకంగా,మానసికంగా ధృడత్వం పెరిగి స్వీయ రక్షణలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.
గోదావరిఖని, మార్కండేయ మండలం: మార్కండేయ కాలనీ శివాలయం వద్ద ఈ రోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటంతో వేడుకకు ప్రత్యేక శోభనీ తెచ్చారు. కార్యక్రమ ప్రధాన వక్త భానుచందర్, RSS ప్రచారక్ మాట్లాడుతూ, “హిందూ ఐక్యతే దేశ బలానికి పునాది, భారత్ విశ్వగురు స్థానం వైపు దిశా సాగుతోంది” అని పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిలో— హిందూ సమ్మేళనం నిర్వహణ అధ్యక్షులు కరివేదా సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి తోట ప్రవీణ్, అలాగే ఈసంపెల్లి వెంకన్న, రాములు, RSS నగర కార్యవహా పెడిపెల్లి రామ్మూర్తి, సహ కార్యవహ మంతెన శ్రీనివాస్, ఉమాపతి, అంబటి సతీష్, శివాలయ కమిటీ అధ్యక్షులు మంచికట్ల బిక్షపతి, బండారి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ ఆదివారం ఉదయం అపార్ట్మెంట్ సందర్శన.... (ఐస్ ఫ్యాక్టరీ బిల్డింగ్) శాంతినికేతన్ కాలనీ శ్రీరామ్ చరణ్ టవర్స్ నీ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు.... అపార్ట్మెంట్ అధ్యక్షులు వారి కమిటీ మెంబర్స్ వారికున్న సమస్యలను కార్పొరేటర్ గారికి తెలిపారు "సమస్యలు శానిటేషన్ క్లీనింగ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారం చుట్టూ కంచ వేయాలని కార్పొరేటర్ గారికి తెలిపారు... కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ మెంబర్స్ అధ్యక్షులు రామ్మోహన్రావు సెక్రటరీ కృష్ణమూర్తిగారు నరేష్ రాజమౌళి తిరుపతిరెడ్డి రజనీకాంత్ నవీన్ అనిల్ రావు సభ్యులు పాల్గొన్నారు.....
గోదావరిఖనిలోని TGNPDCL ఫోర్మెన్గా పదవి విరమణ చేసిన వెంకట్ రాజాంను పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. శేష జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.
చొప్పదండి నియోజకవర్గం జనంగొంతు ప్రతినిధి పులకం గంగయ్య 22-11 -2026 శనివారం ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షా పదవికి తెర పడింది. కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షునిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరును రాష్ట్ర కాంగ్రెస్స్ కమిటి ఎన్నిక చేసింది. ఏమేరకు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు . మేడిపల్లి సత్యం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అనుచరుడిగా ఆయనకు పేరుంది.
విజ్డం హై స్కూల్ రాయికల్ కి చెందిన విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కోర్టును సందర్శించారు. గంటన్నరసేపు కోర్టులో జరిగే కేసుల విచారణ, న్యాయవాదుల వాదోపవాదాలు, జడ్జి తీర్పునిచ్చే విధానాన్ని విద్యార్థులు గమనించారు. కోర్టు ఆవరణలోని రికార్డ్ రూమ్, సెక్షన్ రూమ్ లలో కేసులకు సంబంధించిన ఫైల్స్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయాలను సందర్శించి వివిధ రకాల సేవలు సమస్యల పరిష్కారాల గురించి సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాలలో చదువు మాత్రమే కాకుండా,ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్ ల ద్వారా విజ్ఞానం తో పాటు మంచి, చెడు ల మధ్య తేడాలు,నేరాల మీద వాటికీ విధించే శిక్ష ల మీద అవగాహన, సమాజం లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం, ఉన్నత అధికారులతో ప్రవర్తించే తీరు, వారితో పని తీసుకోవడంలో అవగాహన తో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో , ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో ఎన్సిసి అవతరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు సైనిక శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచడం ఈ సమస్త ప్రధాన లక్ష్యం అని స్కూలు రోజులనుంచి తలపై ఎర్రటి కుచ్చులు గల టోపి తో ఖాకీ దుస్తులు ధరించి శిక్షణ తీసుకునే విద్యార్ధులనే ఎన్.సి.సి. స్టూడెంట్స్ అంటాము నేటి చిన్నారులే రేపటి పౌరులు క్రమశిక్షణాయుత , దేశభక్తిగ పౌరులను తయారుచేయడమే ఎన్.సి.సి. ముఖ్య ఉద్దేశము . ఎన్.సి.సి. లో చేరే పిల్లలు దృఢ చిత్తము తో శిక్షణ సాగిస్తుంటారు . ఎన్ .సి .సి సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగ అవకాశాలకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.