|
modi add 1

కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ పిలుపు.. 49వ డివిజన్‌లో రేపు ప్రభుత్వ పథకాల కోసం ప్రజా పాలన వార్డ్ సభ

రామగుండం 49వ డివిజన్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు (02-04-2026) ఉదయం 10 గంటలకు శారదా నగర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో వార్డ్ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్‌ల కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి. అర్హులైన ప్రజలు అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ కోరారు.

By Ambati Sathish kumar | April 01, 2026 | 0 Comments

ముర్షిదాబాద్ శ్రీరామ నవమి ఉరేగింపు పై రాళ్లు

ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. మార్చి 27, 2026 (శుక్రవారం) సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే రామనవమి పండుగను పురస్కరించుకుని ముర్షిదాబాద్‌లోని రఘునాథ్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాల్లో భక్తులు భారీ ఊరేగింపులు నిర్వహించారు. ఈ క్రమంలో మసీదుగుండా వెళుతున్న సమయంలో వివాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి, ఆపై రాళ్లదాడికి దారితీసింది. ఊరేగింపుపై భవనాలపై నుండి రాళ్లు రువ్వడంతో తొక్కిసలాట జరిగింది. ఆగ్రహించిన అల్లరిమూకలు స్థానిక దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో సుమారు 15 నుండి 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు .... టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తత దృష్ట్యా రఘునాథ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 (ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ 163) విధించి, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, గాలిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసులతో పాటు భారీగా కేంద్ర బలగాలను (CAPF) రంగంలోకి దించారు. ముర్షిదాబాద్ రేంజ్ డీఐజీ అజిత్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. "సిసిటివి (CCTV) ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నామని, హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ రచ్చ మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు, ఎన్నికల సమయంలో కావాలనే మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని అధికార టీఎంసీ విమర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా రామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

By NYALAKONDA ANIL DESAI | March 29, 2026 | 0 Comments

బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ను డంప్ యార్డ్ చేశారు. క్లీన్ చేసేవరకు ఇక్కడే కూర్చుంటాం.a

బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ను డంప్ యార్డ్ చేశారు. క్లీన్ చేసేవరకు ఇక్కడే కూర్చుంటాం. జనం గొంతు బ్యూరో చీఫ్ హైదరాబాద్ 28/03/26 శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి రోజు పదివేల మంది కస్టమర్లు వచ్చి పోతుంటారు. సంవత్సరానికి 14 నుండి15 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే మార్కెట్ ఇది. గత తొమ్మిది నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయింది. ఆ మురిగిపోయిన కూరగాయల నుంచి వచ్చే దుర్గంధపూరితమైన నీళ్లు కాళ్ళ కిందకు వచ్చి పుండు పడిపోతున్నాయి. ఈ దుర్గంధపూరితమైన వాసన వల్ల కస్టమర్లు రావడం లేదు. మార్కెట్లో బిజినెస్ అంతా తగ్గిపోతుంది. మంత్రికి చెప్పినా, కమిషనర్ కి చెప్పినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇది కూరగాయల మార్కెట్ లాగా లేదు డంప్ యార్డ్ లాగా ఉంది. ప్రతినిత్యం రోగాలకు నిలయంగా ఉంది. మహిళ టాయిలెట్ కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయాల్సి వస్తుంది. టాయిలెట్స్ కు నీళ్లు లేవు, డోర్లు లేవు అని మహిళలు చెబుతున్నారు. ఎంతో ఆరోగ్యపరంగా ఉండే ఈ మార్కెట్ యార్డ్ రోగాల నిలయంగా మారింది. ఇక్కడ కట్టిన వాటర్ ట్యాంక్ లో నీళ్లు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, చెత్తను మోసేవారు లేరు. ఈ రోజు నేను వస్తున్నానని తెలిసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. నేనిక్కడికి గంట రెండు గంటలు ధర్నా చేయడానికి రాలేదు. ఇక్కడ ఉన్న చెత్తంతా కూడా తీసేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయించాలి. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పని చేసేంతవరకు, మంచినీళ్లు వ్యవస్థ మెరుగుపరిచే వరకు, కుళ్లిపోయిన కూరగాయలతో బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్ పునరుద్దించే వరకు, చెత్త కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి క్లీన్ చేసేంతవరకు, ఆరోగ్యవంతమైన మార్కెట్ ని చేసేంతవరకు నా ధర్నా కొనసాగుతుంది. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాను. సమస్య పరిష్కరించే వెళ్తాను. అవసరమైతే మార్కెట్ యార్డ్ ను రెండు రోజులు బందు పెట్టైన మొత్తం శుభ్రం చేయాలని కోరుతున్నాను. మహిళలు మాట్లాడే మాటలు ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, లక్ష కోట్లు పెట్టి హైదరాబాదును సుందరీకరంగా చేస్తానన్న మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ మార్కెట్ యార్డ్ ను సాఫ్ చేసే కాంట్రాక్టర్లకు, టాయిలెట్స్ కడిగే కాంట్రాక్టర్లకు, చెత్తను తీసే కాంట్రాక్టర్లకు నెలకు ఏడు లక్షల ఇవ్వలేక తొమ్మిది నెలలు అవుతుంది ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏమీ లేదు. కాంట్రాక్టర్ వెళితే 10 శాతం ఇస్తేనే సంతకం పెడతా అని చెబుతున్నారంటే నీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మీ సంపాదన...ఆ సంపాదనతో ఢిల్లీకి పంపించే ఆలోచన, అధికారం మీద ఉన్న ధ్యాస, బోయిన్పల్లి మార్కెట్ పైన లేదు అంటే సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ఒక కళంకం ఇది. ఇంత ఆర్తనాదాలు, శాపనార్థాలతో, తిట్లతో, దుర్మార్గలతో మంత్రిగా కొనసాగడం కంటే రాజీనామా చేసి మాకు చేతకాదు అని చెప్పుకోవడం మంచిది. నేనిక్కడ ధర్నా చేస్తున్న. మీ కమిషనర్ను పంపిస్తావా, సెక్రెటరీ పంపిస్తావా...వెంటనే పంపించాలి. ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతాదని హెచ్చరిస్తున్నాను.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2026 | 0 Comments

పెట్రోల్ డీసిల్ కు భారత్ లో కొరత లేదు

మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు మన తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయి. అయితే, వాస్తవానికి ఈ పరిస్థితులు మన రాష్ట్రానికి లేదా మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాము. అందువల్ల ప్రపంచ పరిస్థితుల ప్రభావం మన దేశంపైన కూడా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోంది. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న ప్రాసెసింగ్ (refining) సామర్థ్యాన్ని పెంచుతూ, అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే దిశగా కృషి జరుగుతోంది. అంతేకాకుండా విదేశాల నుండి రావాల్సిన పెట్రోలియం ఉత్పత్తులను కూడా విజయవంతంగా దిగుమతి చేసుకునే విధంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదురవుతున్న ఈ సమయంలో, భారత ప్రభుత్వం ప్రతి రోజు అనేక దేశాల నాయకులతో చర్చలు జరుపుతోంది. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉంది. ఎందుకంటే దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కట్టెలు, కిరోసిన్ వంటి ఇంధనాలను ఉపయోగించిన ప్రజలు, ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్పీజీ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. “ఉజ్వల పథకం” ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, చిన్న రైతులు కూడా గ్యాస్ సిలిండర్లను పొందగలిగారు. సబ్సిడీ ద్వారా వారికి మరింత సౌలభ్యం కల్పించబడింది. ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇది సమాచారం పంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. పెట్రోల్ కొరత ఉందనే వదంతులు అనవసరమైన రద్దీకి దారి తీసాయి. అయితే, ఆయిల్ కంపెనీల అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమీ లేదు. దేశవ్యాప్తంగా సరఫరాలు సక్రమంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం అందరం శాంతంగా ఉండి, వదంతులను నమ్మకుండా, బాధ్యతతో వ్యవహరించాలి. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొంటేనే మనం విజయాన్ని సాధించగలం.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2026 | 0 Comments

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన విద్యార్థినిని అభినందించిన పాఠశాల యాజమాన్యం

గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని నరేంద్ర విద్యాలయం హై స్కూల్ లో ఇదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి సిరిపురం జగదీశ్ జెటివో గా ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు పాఠశాల యాజమాన్యం గంగాధర రాజేశం గోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కారం చేశారు. 10 సంవత్సరాలు పాఠశాల లో చదివి ఉన్నత చదువులలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం పొందడం పాఠశాలకు గర్వ కారణమన్నారు. చిన్నప్పటి నుండి చదువులో మంచి ప్రతిభ కనబరిచే వాడాన్నారు. మంచి విద్యార్థిగా ఎదిగినప్పుడు సమాజం లో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి జెటివో గా బాధ్యతలు తీసుకొని ఇతర జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2026 | 0 Comments

ఫీల్డ్‌లో మేయర్ మహంకాళి స్వామి – నీటి సమస్యలపై అధికారులకు అల్టిమేటం

రామగుండం నగరంలో నీటి సరఫరా సమస్యలపై మేయర్ మహంకాళి స్వామి కఠినంగా స్పందించారు. శనివారం శారదా నగర్ పీజీ కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లలో ఏర్పడిన లీకేజీల మరమ్మత్తు పనులను ఆయన స్వయంగా ఫీల్డ్‌లో కూర్చొని పర్యవేక్షించారు. లీకేజీల కారణంగా ప్రశాంత్ నగర్ నుంచి పవర్ హౌస్ కాలనీ వరకు దాదాపు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రేపటి నుంచి నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా లీకేజీలు గుర్తించిన వెంటనే 9392483959 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, ఫోటో తీసి లొకేషన్‌తో వాట్సాప్ చేయాలని ప్రజలను కోరారు. మున్సిపల్ సేవలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇదే నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి కనెక్షన్‌కు వాల్వ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేసవిలో నీటి కొరత లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.

By Ambati Sathish kumar | March 28, 2026 | 0 Comments

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 కి, డీజిల్ పై 10 నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఉపశమనం చేకూరింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో పెట్రోల్ ఇంధన కొరత తీవ్రంగా వుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు వరకూ వెళ్లిందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేరక ఇంధన ధరలు పెరిగాయని, కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, వీటిని పెంచలేదన్నారు. అలాగే చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించుకున్నామని, అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించామన్నారు. లాక్ డౌన్ విధింపు వార్తలన్నీ అవాస్తవమే : కేంద్రం క్లారిటీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఏర్పడిన పరిస్థితులు ,ఇంధన కొరత నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవమేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఎనర్జీ, సరఫరా గొలుసు, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని, గందరగోళం సృష్టిస్తాయని అన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతతతో మెలగాలని పిలుపునిచ్చారు.

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments

కాష్మీర్లో 35 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఓ అద్భుతం జరిగింది. మూడు దశాబ్దాలకు పైగా మూసేసిన శ్రీరాముడి ఆలయం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం హబ్బాకడల్ ప్రాంతంలో వుంది. దీంతో కశ్మీర్ లోయ చరిత్రలో ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. 1857 లో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే అత్యంత పురాతనమైంది. 1990 ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా, కశ్మీరీ హిందువుల సామూహిక వలసల కారణంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఈ ఆలయం కూడా వుంది. ఆలయం పున: ప్రారంభం అవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయంగా చేసే కార్యక్రమాలన్నీ చేశారు., ఒక భారీ మహా యజ్ఞం కూడా చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ ఆలయం తిరిగి తెరవడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 36 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశ్మీరీ హిందూ సమాజ సభ్యులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించి వచ్చారు. ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ద్వారా కశ్మీర్ సాంస్కృతిక వారసత్వం తిరిగి ప్రారంభమైందని స్థానికులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో విగ్రహాలను కూడా ప్రతిష్ఠాపన చేయనున్నారు. కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది. దీంతో జమ్మూ కశ్మీర్ లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పర్యాటకం, సినిమా రంగం బాగా వృద్ది చెందుతోంది .

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌కుండా నిర్ధిష్ట చ‌ర్య‌లు తీసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారికి ధ‌న్య‌వాదాలు.

-: బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇరాన్ (ప‌శ్చిమాసియాలో) యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం నెల‌కొన్న‌ప్ప‌టికీ, మ‌న ద‌గ్గ‌ర‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌కుండా నిర్ధిష్ట చ‌ర్య‌లు తీసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారికి ధ‌న్య‌వాదాలు. ఇరాన్ యుద్ధం నేప‌ధ్యంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధ‌న ధ‌ర‌లుపెరుగుతాయేమో, ఇంధ‌న కొర‌త ఉంటుందేమో అని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు. అయితే ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల బాగోగుల గురించి ఆలోచించే మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కూడ‌ద‌ని, పెట్రోల్, డీజిల్ కొర‌త త‌లెత్త‌కుండా చూడ‌డ‌మే కాకుండా, వాటి ధ‌ర‌లు కూడా పెర‌గ‌కుండా నిర్ధిష్ట చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం నెల‌కొన్న వేళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు మాత్రం పెట్రోల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. అలాగే, డీజిల్ పై లీటరుకు రూ.10గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో, ఇరాన్ యుద్ధం కార‌ణంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లుపెరుగుతాయేమో అని ఆందోళ‌న‌కు గురైన స‌మాన్య వినియోగ‌దారులంద‌రికీ భారీ ఊర‌ట క‌లిగింది. ఒక్క పైసా కూడా ధ‌ర‌లు పెర‌గ‌కుండా ప‌న్నులు త‌గ్గించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు, అస‌లు ఎలాంటి కొర‌త కూడా లేకుండా గ‌ల్ఫ్ ప్రాంతం నుంచి మ‌న దేశానికి చ‌మురు స‌ర‌ఫ‌రా సాఫీగా జ‌రిగేలా మ‌న విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నారు. గ‌ల్ఫ్ ప్రాంతం నుంచి ఇత‌ర దేశాల‌కు చ‌మురు స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. కొన్ని దేశాల్లో ఇంధ‌న సంక్షోభం త‌లెత్తింది. కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారి స‌మ‌ర్ధ నాయ‌క‌త్వం, దూర‌దృష్టి, ఇరాన్ వంటి దేశాల‌తో ఉన్న స‌త్పంబంధాలు పెట్టుకునేటి వంటి విదేశాంగ విధానాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా మ‌న దేశంలో ఇంధ‌న సంక్షోభం రాకుండా చేయ‌గ‌లిగారు. అయిన‌ప్ప‌టికీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మ‌న దేశంలోని ఆయిల్ కంపెనీల‌కు గ‌ల్ఫ్ నుంచి చ‌మురును దిగుమతి చేసుకునే వ్యయం పెరిగింది. దాంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజ‌ల్ ధ‌ర‌ల‌ను పెంచుతాయేమో అనే క‌ల‌వ‌రం ప్ర‌జ‌ల‌ను వెంటాడింది. అయితే ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల బాగోగుల‌కే ప్రధాన్య‌త ఇచ్చే మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు తక్ష‌ణ‌మే స్పందించి, పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గించ‌డ‌మే కాకుండా డీజిల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొల‌గించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వానికి సామాన్యుల ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని మ‌రోసారి రుజువు చేసారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌కుండా ఉప‌శ‌మ‌నం క‌లిగించిన‌. అస‌లు ఇంధ‌న కొర‌తే రాకుండా సామాన్యుల‌కు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా నిర్ధిష్ట చ‌ర్య‌లు తీసుకున్న మ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీ గారికి మ‌న‌మంతా ధ‌న్య‌వాదాలు తెల‌పుకోవాలి.

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments

కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో 50వ డివిజన్‌లో విస్తృత ఫాగింగ్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్‌లో ఈరోజు సాయంత్రం మున్సిపల్ సిబ్బంది చేత విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ఎక్కడా నిల్వ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

By Ambati Sathish kumar | March 27, 2026 | 0 Comments