కరీంనగర్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కి సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 12100/- ఈఎస్ ఐ, ఈపీఎఫ్ అదనం. కరీంనగర్ కు స్థానిక రాకపోకలకు అనుకూలమైన వారు సంప్రదించండి 9666877880 6300661014 2) మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ హైవే మీద గల సర్వీస్ సెంటర్ లో సెక్యూరిటీ సిబ్బంది కావలెను. జీతం 11000 ఈఎస్ఐ ఈపిఎఫ్ అదనం సంప్రదించండి 6300661014 3) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఫార్మా కంపెనీలకు సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 13000/- ఉచిత వసతి భోజనం సౌకర్యం ఉంటుంది. ఈఎస్ఐ ఈపీఎఫ్ అదనం జడ్చర్ల నుండి 40 కి.మి. అవతలి వారు అర్హులు. సంప్రదించండి 6300661014 4) హైదరాబాద్ నుండి విజయవాడ రూట్ చౌటుప్పల్ కు 13 కి.మి. దూరంలో గల సైట్ లో సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 16000/- ఉచిత వసతి మాత్రం ఉంది భోజనం లేదు. చుట్టూ ఎత్తైన గుట్టలు ఉండడం వల్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హైమాస్ లైటింగ్ వ్యవస్థ విద్యుత్ ఫెన్సింగ్ సి కెమెరా లు ఉంటాయి ఇబ్బంది లేదు. 6300661014
తెలంగాణ లో జరగబోయే ఎన్నికలతో రాజకీయ వర్గాల్లో అనేక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, బిజేపి, కాంగ్రెస్ లు ఎవరికి వారే అదికారం మాదే అనే ఆలోచనలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తిరిగి మరింత అదనంగా జోడించి కొనసాగిస్తాం అంటూ బిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుండగా. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ గా సామాజిక భద్రత అవసరం. వ్యక్తిని బలోపేతం చేస్తే సమాజం ఆర్దికంగా నిలబడుతుందంటూ బిజేపి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అంత నిగూడమైన లోతుల్లోకి వెల్లి అర్థం చేసుకునే మనస్తత్వం సామాన్య ఓటరుకు ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అడుగంటిపోయిన తన ప్రాభవాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలతో దూకుడు ప్రదర్షిస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణా ఆర్థిక స్తోమత కు మించి హామీలను గుప్పిస్తోంది. పనిలోపనిగా కాంగ్రెస్ కు మొదటినుండి వెన్నుదన్నుగా నిలబడిన క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కు మాత్రమే పడేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది. తద్వారా కర్ణాటక లో మాదిరిగా తెలంగాణ లో కూడా అదికారం అంది పుచ్చుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ అదిష్టానం ఉంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ అదికారం లోకి వచ్చినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అదికారం లోకి రాకపోతే కాంగ్రెస్ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ నీడన ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా బిజెపి ని హిందుత్వ పార్టీగా మైనారిటీలకు సూచికగా చూపించి వేసిన ఓట్ల గేలంతో అదికారం అందిపుచ్చుకున్న కాంగ్రెస్ కు తెలంగాణా లో కూడా అదే ఫార్ములా ప్రయోగిస్తే ఇక్కడి సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పాచికలో చిక్కుతారా లేక కాంగ్రెస్ కే ఝలక్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే బిఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు సామాన్యులకు మేలు చేకూర్చినప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్య పూరిత వ్యవహారాల మూలంగా కేసిఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ వారి ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారాల మూలంగా సామాన్య ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది చాలా వరకు కేసిఆర్ అండ్ టీమ్ మీద వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. ఇక బిజెపి విషయానికి వస్తే అదికారం అందుకునే దాకా అని పైకి లేచిన బిజేపి గాలి అంతే వేగంగా కిందికి పడిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైకి లేచిన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంలో తెలంగాణ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే కేంద్ర సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి రహిత కేంద్ర పాలన. దేశ భద్రత అంశాల్లో గత పాలకులకు కేంద్రం లో అదికారం లొ ఉన్న బిజెపి ప్రభుత్వానికి గల తేడా. సామాన్యుడిని కూడా ఆర్దికంగా తనంతట తానుగా ఆర్దికంగా నిలదొక్కుకునేలా అనుసరిస్తున్న కేంద్ర విదానాలు. హిందుత్వ కార్డు తమను గట్టెక్కిస్తాయని అనుకుంటున్నారు. రేపటి గురించి ఆలోచించి బుర్ర పాడు పాడుచేసుకోవడం ఎందుకు ఈరోజు మాత్రం చాలు అంటూ తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చూడగలిగే సామాన్య ఓటరుకు ఇవన్నీ అర్దమవుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో...
Your experience on this site will be improved by allowing cookies.